ఆడపిల్లల జీవితంలో తండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కువగా తల్లి కంటే తండ్రినే ఇష్టపడుతుంటారు. తమకు కాబోయే భర్త తండ్రిలా ఉండాలని కలలు కంటుంటారు. అయితే, కొంతమంది కీచక తండ్రులు పేగు బంధానికి విలువ ఇవ్వటం లేదు. తమ స్వార్థం కోసం కన్న బిడ్డలను కూడా బలిచేస్తున్నారు. తాజాగా, ఓ తండ్రి తన ఇద్దరు కవల కూతుళ్లను డబ్బు కోసం అమ్మేశాడు. రెండో భార్యతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తెలంగాణలోని కామారెడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలానికి చెందిన కవల ఆడపిల్లలు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. భార్య చనిపోగానే వారి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యకు ఓ కుమారుడు, కుమార్తె పుట్టారు. అయితే, సవతి తల్లి ఆ కవల ఆడపిల్లల్ని సరిగా చూసుకునేది కాదు. ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇక, తమ పిల్లలతో పాటు ఇద్దరు సవతి పిల్లల్ని పెంచటం ఆమెకు ఇబ్బంది మారింది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి కవల పిల్లల్ని అమ్మేయాలని నిశ్చయించుకున్నారు. మధ్యవర్తుల ద్వారా బేరం జరిగింది. దండుపల్లికి చెందిన శర్మన్ అనే వ్యక్తి 80 వేలకు చిన్న అమ్మాయిని కొన్నాడు. తర్వాత ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
అక్కడినుంచి మళ్లీ తమ ఊరికి తీసుకెళ్లాడు. ప్రతీ రోజు శారీరకంగా అమ్మాయిని హింసించేవాడు. అతడి వద్దనుంచి తప్పించుకున్న బాలిక డీసీపీవోను కలిసింది. తన గోడును వెల్లబోసుకుంది. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన అక్కను 50 వేలకు కొన్నాడని ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి తన అక్కను హింసిస్తున్నాడని వాపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.