పేరు సుఖేష్ చంద్రశేఖర్.. ఖరీదైన కార్లు, విలాస వంతమైన భవనాలు. అడ్డగోలు దందాతో ఇతని ఆస్తులు కోట్లకు పడగలెత్తాయి. ఇక లగ్జరీ కార్లు, కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు ఇలా ఇతని గురుంచి చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించి చివరికి జైళ్లో చిప్ప కూడు తింటున్నాడు. ఇక విషయం ఏంటంటే..? ఇక తమిళనాడులో సుఖేష్ చంద్రశేఖర్ పేరు తెలియని రాజకీయ నేతలు, బడా వ్యాపారులు ఉండరనేది కాదలేని వాస్తవం.
రాజకీయ నాయకులే టార్గెట్ గా ఎన్నో అక్రమాలకు పాల్పడి అవినీతి తిమింగలంలా మారాడీ సుఖేష్ చంద్రశేఖర్. కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ లు దక్కించుకోవాలన్న, ఉద్యోగ బదిలీలు కావాలన్న, సీబీఐ కేసుల నుంచి తప్పించాలన్నా.. ఇలా ఎన్నో విషయాల్లో అందరినీ మభ్యపెట్టి ఇప్పటికీ ఎంతో మందిని మోసం చేశారు సుఖేష్ చంద్రశేఖర్. ఇక ఇదే కాకుండా దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరనణాంతరం ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ చిహ్నం రెండు ఆకుల గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పట్లో తాత్కాలికంగా నిషేదం విధించింది. ఇందులో భాగంగా రెండాకుల గర్తును మీకు చెందేలా చేస్తానంటూ ఆ పార్టీ నేతల నుంచి డీల్ కుదుర్చకుని ఢిల్లీలో రూ.200 కోట్ల లంచం తీసుకుంటుండగా ఈడీ అధికారులకు అడ్డంగా దొరికాడు.
దీంతో 2017లో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్ర ఎన్నో అక్రమ సంపాదనలను కూడబెట్టాడని తెలుస్తోంది. అయితే తాజాగా ఈడీ అధికారులు చెన్నై కానుత్తురిలోని ఉన్న అతని భారీ భవనంలో ఈడీ అధికారులు సోదాలు నిర్విహించారు. ఈ సోదాల్లో భాగంగా సుఖేష్ చంద్రశేఖర్ భాగోతాన్ని తవ్వితీస్తే ఖంగితినే ఎన్నో అక్రమ సంపాదనలు వెలుగుచూస్తున్నాయి. విదేశాల నుంచి తెచ్చుకున్న 15 లగ్జరీ కార్లతో పాటు, బ్రాండ్ కంపెనీల షూలు వందకు పైగా ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా ఎన్నో వేల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో తేలింది. ఇక ఢిల్లీలో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ను తాజాగా ఈడీ అధికారులు తన అక్రమ సంపాదనపై ప్రశ్నించారు.