Emerald Panchamukhi Vinayaka: ప్రకాశం జిల్లాలో అత్యంత అరుదైన, పురాతన మరకత పంచముఖ వినాయక విగ్రహం వెలుగు చూసింది. ఎర్రగొండపాలెంలోని వైఎస్సార్ సీపీ నేత వై.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఆ విగ్రహం లభ్యమైంది. తాజాగా, వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆ ఇంటినుంచి పంచముఖ వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాన్ని కలిగి ఉన్న వెంకటేశ్వరరెడ్డితో పాటు మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఆ విగ్రహం తమ గ్రామానికి చెందినదని, దాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అనుమతులు ఉన్నాయని వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు చెప్పారు.
దీంతో పోలీసులు విగ్రహానికి సంబంధించిన అనుమతుల పత్రాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన్ని ఇంటికి పంపించేశారు. వారిపై కేసు నమోదు చేసుకుని నోటీసులు కూడా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని హైదరాబాద్నుంచి తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. ఈ విగ్రహం విలువ 25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: ఇండియన్ ఐడల్ తెలుగు ఫినాలేలో మెరిసిన మెగాస్టార్! రానాపై సెటైర్స్!