Eluru: ఏలూరు జల్లాలో విషాదం చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న ఇద్దరు అన్నదమ్ములపై హైఓల్టేజ్ తీగ పడటంతో వారు అక్కడికక్కడే మరణించారు. బైకుతో పాటు కాలి బూడదయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన 21 ఏళ్ల వల్లేపల్లి నాగేంద్ర, 19 ఏళ్ల ఫణీంద్ర అన్నదమ్ములు. నాగేంద్ర ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్ సెకండియర్ పూర్తి చేశాడు. అన్నదమ్ములిద్దరూ ఇంటి పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతుంటారు. గురువారం పాలు తెచ్చేందుకు పొలం దగ్గరికి బైకుపై బయలు దేరారు. అయితే, మార్గం మధ్యలో 11 కిలోవాట్ల కరెంట్ తీగ తెగి వారిపై పడింది.
దీంతో బైకుతో పాటు దానిపై ఉన్న అన్నదమ్ములు కూడా సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికందిన ఇద్దరు కుమారులు చనిపోవటంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bihar: కొత్త కోడలని నెత్తిన ఎక్కించుకున్నారు.. అందంగా ముస్తాబై మార్కెట్ కు వెళ్లి అంతలోనే!