ప్రియురాలితో చేతులు కలిపి నా భర్త నన్ను చంపాలని చూస్తున్నాడు. ఈ విషయంలో నాకు పోలీసులే న్యాయం చేయాలి. లేకుంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా సంచలనంగా మారుతోంది. వెంటనే నా భర్త, అతని ప్రియురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ తన బాధను వెళ్లగక్కింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు గోదావరి జిల్లా కె. గంగారం మండలం శివల గ్రామానికి చెందిన వ్యక్తితో లోవలక్ష్మికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. భార్యాభర్తలు స్థానికంగా పని చేసుకుంటూ సంసారాన్ని సాగిస్తున్నారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత లక్ష్మి భర్త తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. భార్య లోవలక్ష్మికి తెలియకుండా భర్త కొన్నిరోజుల పాటు తన చీకటి కాపురాన్ని గడుపుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల తన భర్త సాగిస్తున్న చీకటి కాపురం ఎట్టకేలకు భార్య లక్ష్మికి తెలిసింది. దీంతో ఇదే విషయమై ఆ మహిళ భర్తను నిలదీసే ప్రయత్నం చేసింది. కానీ భర్త మాత్రం ప్రియురాలితో కలిసి నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆ మహిళ వాపోయింది.
ఇక భర్త తీరుతో తట్టుకోలేకపోయిన లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా భర్త, అతని ప్రియురాలితో కలిసి నన్ను బెదిరిస్తున్నారని, చంపే ప్రయత్నం కూడా చేయబోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ముగ్గురుకి కౌన్స్ లింగ్ ఇచ్చే విషయంలో పోలీసులు కాస్త ఆలస్యం చేశారు. ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతున్నా.. నాకు ఎలాంటి న్యాయం జరగడం లేదని, నాకు న్యాయం చేయకుంటే పోలీస్ స్టేషన్ ను ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ సెల్పీ వీడియో విడుదల చేసింది. ఆ మహిళ వీడియోతో అలెర్ట్ అయిన పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.