ఈ మద్య మహిళలపై ఎక్కడ చూసినా అత్యాచారాలు.. లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. దారుణం ఏంటంటే కామంతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు వావివరుసలు మర్చిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలైన బాలిక తండ్రి పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన కేరళాలో వెలుగు చూసింది.
ఇటీవల కొంత మంది కామంతో రెచ్చిపోయి వావివరుసలు మర్చిపోతున్నారు.. సొంత అక్కాచెల్లెల్లు, కూతుళ్లపై అత్యాచారం చేసిన దారుణ ఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. పతనంతిట్ట జిల్లాకు చెందిన 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై 45 ఏళ్ల తండ్రి కృరమృగంలో రెచ్చిపోతూ పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయడమే కాదు.. ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ పై అత్యంత దారుణంగా దాడి చేస్తూ హింసించేవాడు. ఈ బాధలు తట్టుకోలేక ఆ బాలిక భయంతో పారిపోయి స్కూల్లో తలదాచుకుంది. తెల్లవారుజామున పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంతో ఏడుస్తూ కనిపించిన బాలికకు ధైర్యం చెప్పారు.. తండ్రి చేస్తున్న అకృత్యాల గురించి ఆ బాలిక వివరించింది.
దివ్యాంగ బాలిక చెప్పిన మాటలు విన్న ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే చైల్డ్ లైన్ కార్యకర్తలకు సమాచారం అందించారు ఉపాధ్యాయుడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కొంతకాలం క్రితం నిందితుడి వేధింపులు భరించలేక అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది.. అప్పటి నుంచి దివ్యాంగురాలైన బాలిక తండ్రి వద్దనే ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఆ బాలిక తండ్రి ప్రతిరోజూ తాగి వచ్చి కామంతో కూతురిపై రెచ్చిపోయి అత్యాచారం చేస్తూ వచ్చాడు.
ఈ మద్య ఆ బాలికను చిత్ర హింసలకు గురిచేయడంతో భరించలేక భయంతో పారిపోయి స్కూల్లో దాచుకోవడం.. ఉపాధ్యాయులకు చెప్పడంతో కీచక తండ్రి గుట్టు బయటపడింది. విచారణ చేసిన కోర్టు తండ్రి దుర్మార్గంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. వివిధ సెక్షన్ల ప్రకారం అతనికి 107 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు నాలుగు లక్షల జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తం బాలికకు పరిహారంగా అందించాల్సిందిగా తీర్మాణం చేసింది.