నెల క్రితం ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ ఉందంతం దేశ వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియుడు అఫ్తాబ్ ఆమెను దారుణంగా చంపి, శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం ఆ ముక్కల్ని ప్రిజ్లో దాచాడు. 18 రోజుల్లో ఆ ముక్కల్ని నగరంలోని అక్కడక్కడా పడేశాడు. ఈ సంఘటన మరువక ముందే అచ్చం ఇలాంటి సంఘటనే ఢిల్లీలో మరొకటి చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో బాధింపబడింది ఆడవాళ్లు కాదు.. ఓ పురుషుడు. కట్టుకున్న భార్యే అతడ్ని చంపింది. అది కూడా తన కుమారుడి సహాయంతో. భర్తను చంపిన తర్వాత భార్య, కుమారుడు అతడి మృతదేహ్నాన్ని ముక్కలు చేశారు. అనంతరం ఆ ముక్కల్ని అప్పుడప్పుడూ దగ్గరలోని గ్రౌండ్లో పడేస్తూ వచ్చారు. చివరకు పాపం పండి సోమవారం పోలీసులకు చిక్కారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ, పాండవ్ నగర్కు చెందిన పూనమ్, దాస్ భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు దీపక్ ఉన్నాడు. గత కొంత కాలంగా దాస్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే పూనమ్, అతడికి మత్తు మంది ఇచ్చింది. అనంతరం కుమారుడి సహాయంతో గొంతు నులిమి చంపింది. అతడ్ని చంపేసిన తర్వాత శవాన్ని బయటపడేయటం వారికి ఇబ్బందిగా మారింది.
దీంతో దాస్ శవాన్ని ముక్కలుగా చేశారు. అనంతరం అవి పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్లో దాచారు. తర్వాత ఆ ముక్కల్ని కొన్ని కొన్నిగా ప్లాస్టిక్ కవర్లో ఉంచి దగ్గరలోని గ్రౌండ్లో పడేస్తూ వచ్చారు. అయితే, ప్లాస్టిక్ కవర్లలో మనిషి శరీర భాగాలు ఉండటం స్థానికుల కంట పడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముక్కలు పడేసిన ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా పూనమ్, దీపక్లు కవర్లతో గ్రౌండ్లోకి వెళ్లటం కనపడింది. దీంతో పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
A woman along with her son arrested by Crime Branch in Delhi’s Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
(CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X
— ANI (@ANI) November 28, 2022