ఆంటీతో పెట్టుకున్న అఫైరే ఆ కుర్రాడికి శాపంగా మారింది. అర్ధరాత్రుళ్లు గంటలు గంటలు ఫోన్లో ముచ్చట్లు తీరా విషయం అంకుల్కు తెలిసేసరికీ ఆంటీ పక్కకు తప్పుకుంది. ప్రియుడు బుక్కయ్యాడు. అసలేం జరిగిందంటే. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఫిజియోధెరపిస్ట్ డాక్టర్ కిరణ్కుమార్ భార్య కుష్బుసింగ్ స్థానికంగా ఉండే జిమ్ ట్రైనర్ విక్రమ్తో అఫైర్ పెట్టుకుంది. ఆ విషయం కుష్బు భర్త కిరణ్కుమార్కు తెలిసి విక్రమ్ను చంపుతానని బెదిరించాడు. దాంతో విక్రమ్ ఆంటీతో దూరంగా ఉంటూ వచ్చాడు. తర్వాత కొంతకాలానికి మళ్లీ వీరి బంధం చిగురించింది.
అర్థరాత్రుళ్లు ఫోన్లు గంటలకొద్ది మాట్లాడుకునేవారు. ఆంటీ విక్రమ్ 1100 ఫోన్ కాల్స్ చేసుకున్నారు. ఫోన్ చేసిన ప్రతిసారి మినిమమ్ 30-40 నిమిషాలు మాట్లాడుకునే వారు. మళ్లీ విషయం అంకుల్ కిరణ్కు తెలిసి విక్రమ్ను చంపేస్తానని బెదిరింపు ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని అంగతకులు విక్రమ్పై కాల్పులు జరిపారు. 5 బుల్లెట్లను విక్రమ్ శరీరంలోకి దింపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు జిమ్కు వెళ్తున్న విక్రమ్పై కదమ్కౌర్ ప్రాంతంలో ఎటాక్ జరిగింది. ప్రస్తుతం విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ కిరణ్కుమార్, అతని భార్య కుష్బు తన హత్యకు కుట్రపన్నారని విక్రమ్ ఇచ్చిన వాగ్మూలంతో దంపతులను పోలీసులు విచారించారు. వారిద్దరి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కుట్ర బయటపడింది.