Crime News : కొందరు తమ కామ దాహంతో పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. వావి వరసలు మరిచి, రక్షించాల్సిన వారే ప్రాణాలు తీస్తున్నారు. ఓ వ్యక్తి కోడలు వరసయ్యే ఓ బాలికను స్నాక్స్ కొనిస్తానని చెప్పి నమ్మించి తీసుకెళ్లి రేప్ చేశాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని అలీఘర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. ఉత్తర ప్రదేశ్లోని అలీఘర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం అతడికి కోడలు వరసయ్యే ఓ 9 ఏళ్ల బాలికను స్నాక్స్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడు.
బాలిక విషయం బయట చెబుతుందన్న భయంతో ఇటుకతో కొట్టి చంపాడు. అనంతరం వడ్రంగి పనులు చేసే చోట శవాన్ని పడేసి వెళ్లిపోయాడు. పాప ఎంత సేపటికి ఇంటికి రాకపోటంతో తల్లిదండ్రులు పాప కోసం వెతకసాగారు. తన మీద అనుమానం రాకూడదని పాప కుటుంబసభ్యులతో పాటు తాను కూడా వెతకటం మొదలుపెట్టాడు. కొద్ది సేపటి తర్వాత పాప సోదరి( చిన్న బాలిక) నిందితుడు తన సోదరిని స్నాక్స్ కొనించటానికి తీకెళ్లాడని చెప్పింది. దీంతో అతడిపై అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడో డ్రగ్ అడిక్ట్ అన్న సంగతి తెలిసింది. అరెస్ట్ చేసే సమయంలో కూడా అతడు మత్తులో ఉన్నాడని వెల్లడైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
చదవండి : ఫేస్బుక్లో ‘అల్లరి పిల్ల’ వల.. నగ్నంగా కాల్స్.. ఆపై..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..