అది చత్తీస్ గఢ్ జయనగర్ పరిధిలోని కార్వాన్ గ్రామం. ఇక్కడే ప్రణయ్ రాజ్వాడే (46), లాలోబాయి (28) దంపతులు నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. అలా కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు కాపురాన్ని నెట్టుకొచ్చారు. కానీ, రోజులు గడిచే కొద్ది భర్త ప్రణయ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో రోజూ తాగి ఇంటికొచ్చి భార్యతో గొడవపడేవాడు.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు రాత్రి భర్త ప్రణయ్ అతిగా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రణయ్ పడక గదిలోకి వెళ్లాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ప్రణయ్.. తన భార్య లాలోబాయిని గదిలోకి పిలిచి శృంగారం చేయాలని కోరాడు. దీనికి లాలోబాయి నిరాకరించింది. ఈ క్రమంలోనే కోపంలో ఊగిపోయిన ప్రణయ్.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య మెడపై మూడు సార్లు దాడి చేశాడు. ఈ దాడిలో భార్య లాలోబాయి తలతెగిపోయి పడి ప్రాణాలు విడిచింది.
ఇక భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త.. ఆ క్షణమే ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రణయ్ సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడు ప్రణయ్ ను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. శృంగారానికి నో చెప్పిందని భార్యను కిరాతకంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.