ఈ రోజుల్లో పెద్దలు కుదుర్చిన వివాహాల కన్నా, కొన్ని ప్రేమ పెళ్లిల్లే చివరికి ఊహించని విషాదాన్ని మిగిల్చుతున్నాయి. మొదట్లో ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయిన ఎదిరించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. ఏడాది, రెండేళ్లు గడిచే సరికి అక్రమ సంబంధాలు, భార్యాభర్తల గొడవలు.. ఇలాంటి కారణాలతో సంసారాలను నిట్టనిలువునా చీల్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం యూనియన్ విరయూర్. ఇదే ప్రాంతానికి చెందిన అన్బరసి(25) అనే యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ యువతికి తిరువళ్లూరు జిల్లాకు చెందిన లక్ష్మణన్ అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే వీరిద్దరు ఏడాది పాటు మాట్లాడుకున్నారు. అలా రోజులు గడిచే కొద్ది వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఒకరికొకరు నచ్చుకోవడంతో ప్రేమించుకున్నారు. కులాలు వేరైన పెద్దలను ఒప్పించి రెండేళ్ల కిందట ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అలా కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది.
అలా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే అత్తింటి వాళ్లు కోడలిని కులం పేరుతో ద్వేషించారు. ఎన్నో అవమానాలకు గురి చేసి నరకం చూపించారు. దీంతో కోడలు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే అత్తింటివాళ్లు కోడలిని కులం పేరుతో దూషించడమే కాకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీనిని జీర్ణించుకోలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తలకు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. బుద్దిగా ఉంటారనుకున్న సమయంలోనే అత్తింటివాళ్లు ఆ మహిళపై భౌతిక దాడికి దిగారు.
దీనిని ఆ మహిళ తట్టుకోలేకపోయింది. ఇలా అయితే నాకు న్యాయం జరగదని గ్రహించిన ఆ మహిళ తాజాగా తన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంది. స్పందించిన ఎస్పీ ఆ మహిళకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుత్తణి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.