మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య మిస్టరీపై ఎన్నో రోజుల నుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయినా ఇప్పటికీ సీబీఐ ఖచ్చిమైన సమాచారాన్ని బయట పెట్టలేకపోయింది. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ మధ్య ఒకరిద్దరిని అనుమానితులను విచారించినా ఫలితం మాత్రం లేకపోయింది. ఏడాదికిపైగా సా..గుతున్న ఈ కేసులో నిజనిజాలను రాబట్టంలో సీబీఐ విఫలమవుతోంది.
ఈ మధ్య సీబీఐ అధికారులు కాస్త దూకుడు పెంచి హత్య కేసుకు సంబంధించిన కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులోని నిందితులు బయటపడుతున్నట్లు అనిపించింది. కానీ అందరూ అనుకున్న రీతిలో హత్యకు కారకులైన వారిని పట్టుకోలేకపోతున్నారు. దీంతో హత్య చేసిన వారిని పట్టుకునేందుకు సీబీఐ ఓ కొత్త మంత్రాన్ని మందుకు నెట్టింది.
వివేకా కేసులో ఎవరైనా ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తే వారికి 5 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సీబీఐ అధికారులు ప్రకటించారు. సమాచారం ఇవ్వాలి అనుకున్న వ్యక్తులు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ దీపక్ గౌర్ 9474256974, ఎస్పీ రామ్ సింగ్ 9988272709 నెంబర్లకు వివరాలు అందించాలని సీబీఐ అధికారులు కోరుతున్నారు. ఇక తాజాగా ఇదే అంశంపై నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందించి రూ.5 లక్షలు కాకుండా కోటి నగదును ప్రకటించాలని ఆయన సూచించారు.