నగరం నడిబొడ్డున సీక్రెట్ గా సాగుతున్న గంజాయి గుట్టును రట్టు హైదరాబాద్ పోలీసులు. విద్యార్థులు, స్కూల్, కాలేజీలనే టార్గెట్ గా చేసుకున్న కేటుగాళ్లు ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా పాన్ షాపులలో కూడా గంజాయిని విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీసులు నిందితుడి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్ చెందిన జాఫర్ అనే వ్యక్తి హైదరాబాద్ ను అడ్డాగా చేసుసుకుని సీక్రెట్ గా గంజాయిని విక్రయిస్తున్నాడు.
ఇతను కాలేజీ స్టూడెంట్స్ ని మెయిన్ టార్గెట్ గా చేసుకుని గంజాయిని సరఫరా చేస్తున్నాడు. బిహార్ నుంచి గంజాయిని తీసుకొస్తూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలు, పాన్ షాప్స్ లలో రూ. 50 నుంచి రూ. 100కు గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ గంజాయిని జాఫర్ 3 ఫ్లేవర్ లలో సిద్దం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు గంజాయి రవాణాపై ఓ కన్నేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు గంజాయి సరఫరా ప్రధాన సూత్రదారి అయిన జాఫర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి దాదాపుగా 31 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన గంజాయి చాక్లెట్స్ అంశం తీవ్ర కలకలంగా మారుతుంది.