చత్తీస్ఘడ్లోని రాజ్నంద్గావ్ జిల్లా గాతాపార ప్రాంతంలో ఓ 15 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది. అయితే స్థానికంగా ఓ యువకుడి ప్రేమలో పడింది. ఆ యువకుడి ప్రేమలో మునిగిపోయిన ఈ యువతి అతనితో కలిసి తిరగటం, జల్సాలు వంటివి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న అర్ధరాత్రి సమయంలో తన ప్రియుడిని నుంచి కలవాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో అతడిని నమ్మిన ఆ యువతి ఓ నిర్మానుష్య ప్రాంతానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. అయితే ఆ యువతిపై తన ప్రియుడు అత్యాచారారినికి ఒడిగట్టి ఆనంతరం ఆ యువతిని వదలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అదే రాత్రి తన ఇంటికి వెళ్లే క్రమంలో ఓ నలుగురు ముఠా గ్యాంగ్ ఆ యువతిని బెదిరించి ఎత్తుకెళ్లి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. ఏడుస్తూ అదే రాత్రి ఇంటికెళ్లి తల్లిదండ్రులకు తన ప్రియుడు, ఓ ముఠా గ్యాంగ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిపింది.
దీంతో ఖంగుతిన్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఆ యువకుడితో పాటు ముఠా గ్యాంగ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిని డమర్ డీహ్ గ్రామానికి చెందిన కామేశ్వర్ వర్మ, కౌశల్ పటేల్, రాజేశ్ వర్మలుగా గుర్తించారు పోలీసులు.