ఈ మద్య కొన్ని చోట్ల దొంగలు పోలీసులను, జనాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఈ మద్య దొంగలు మారణాయుధాలతో పట్టపగలే రెచ్చిపోతున్నారు. జ్యూవెలరీ షాపులు, బ్యాంకులను టార్గెట్ చేసుకొని పక్కా రెక్కీ నిర్వహించి సమయం చూసి దొంగతనాలకు పాల్పపడుతున్నారు. ఆ సమయంలో అడ్డం వచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటన హజీపూర్ లో జూన్ 22న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీహార్లో వైశాలి జిల్లాలోని హజిపుర్ పట్టణంలో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. జ్యూయలరీ షాపులోకి తుపాకులతో చొరబడి ఆ దుండగులు అక్కడ ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేశారు. కానీ షాపు యజమాని సునీల్ ప్రియదర్శి వారిని ఎదుర్కొన్నాడు.. వారి ప్రయత్నం ఆపేందుకు ముందుకు వచ్చాడు. కానీ దుండగులు అతన్ని దారుణంగా కడుపులో తన్నారు.. విపరీతంగా కొట్టారు. తర్వాత అందినంత బంగారు నగలు తీసుకొని తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపేశారు. వెళ్లే సమయంలో షాపు యజమాని సునీల్ ని కాల్చి చంపారు. ఇదంతా సీసీ టీవీలో రికార్డు అయ్యింది.
ఈ దారుణమైన ఘటనతో నగరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తక్షణ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం నగల దుకాణాలు ఉన్న ప్రాంతంలో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. అయితే బీహార్ లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఓ కిరాణా షాపులో దోపిడీ జరిగింది.. ఆ సమయంలో అడ్డు వచ్చిన షాప్ కీపర్ ని దుండగులు కాల్చేశారు. తర్వాత కౌంటర్లో డబ్బులు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बिहार pic.twitter.com/hFQRVOBsQn
— Sanket Upadhyay (@sanket) June 26, 2022