ప్రస్తుతం సమాజంలో వివాహేతర సంబంధాలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. కట్టుకున్న వారితో కంటే పరాయి వారితో పక్క పంచుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కుటుంబం పరువుకన్నా.. క్షణిక సుఖాలే ఎక్కవని భావిస్తున్నారు. జీవితం పంచుకోవాల్సిన భాగస్వామి కంట్లో కారం కొట్టి అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇవి వయసులో ఉన్న వాళ్లే చేస్తున్నారు అనుకునేవారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే విషయం విన్న తర్వాత వివాహేతర సంబంధానికి వయసుతో సంబంధం లేదని మీరే ఒప్పుకుంటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు తాతలు ఒక 30 ఏల్ల వితంతువుతో సంబంధం పెట్టుకున్నారు. ఇదే దరిద్రం అని మీరు అనుకుంటే.. అంతకు మించిన దరిద్రం ఏంటంటే.. నలుగురు ఒకేసారి శృంగారంలో పాల్గొంటారట.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పిను దేవి అనే 30 ఏళ్ల మహిళ భర్త చనిపోయాడు. ఆమె వారి స్వగ్రామంలో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. కొట్టు పెట్టిన కొన్నాళ్ల తర్వాత ఆమెకు నలుగురు వృద్ధులు పరిచయం అయ్యారు. రోజూ ఆమె టీ కొట్టుకు వస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. కొన్నాళ్లకు వారి పరిచయం కాస్తా.. పక్క పంచుకునే వరకు వెళ్లింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ నలుగురు వృద్ధులు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇక్కడ దిమ్మతిరిగే విషయం ఏంటంటే.. ఆ నలుగురు వృద్ధులు మహిళతో ఒకసారి శృంగారంలో పాల్గొనేవారట. వాళ్లు ఎప్పుడు కలవాలి అనుకున్నా కృష్ణనందన్ ప్రసాద్(75), వాసుదేవ్ పాశ్వాన్(63), లోహా సింగ్(62), సూర్యమణి కుమార్(60) ఈ నలుగురు వృద్ధులు ఒకేసారి మహిళతో శృంగారంలో పాల్గొనేవారంట.
కొన్నాళ్లు వీళ్ల చీకటి బంధం చక్కగా సాగిపోయింది. ఆ మహిళతో నలుగురు తాతలు కలిసి వారి తిప్పలు వాళ్లు పడుతూ వచ్చారు. అయితే కొన్నాళ్లకు పిను దేవికి తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. తృపిత్ శర్మ కూడా ఆ మహిళపై మనసు పారేసుకున్నాడు. తనని కూడా ఆదరిస్తుందని భావించి.. ప్రయత్నాలు కొనసాగించాడు. అయితే ఇప్పటికే నలుగురు వృద్ధులను చేరదీసిన ఆ మహిళ.. ఐదు వృద్ధుడిని కూడా అక్కున చేర్చుకుంది. అయితే ఈ నలుగురు వృద్ధులతో కలిపి అవకాశం ఇవ్వలేదు. తృపిత్ శర్మకు ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ఇతనితో కూడా కొన్నాళ్లు సత్సంబంధాలు నెరిపింది. అయితే తృపిత్ శర్మ ఆ నలుగురు వృద్ధులు మాదిరి అల్ప సంతోషి కాదనమాట.
తృపిత్ శర్మ.. ఆ మహిళ మొత్తంగా తనకే కావాలని పథకం రచించాడు. కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నప్పటికీ.. తర్వాత తన ప్లాన్ బయటపెట్టాడు. ఆ నలుగురితో కలిస్తే బాగుండదని మహిళను హెచ్చరించాడు. కేవలం తనతో మాత్రమే గడపాలని ఆ నలుగురు వృద్ధులను దూరం పెట్టాలని తృపిత్ శర్మ చెప్పాడు. తన మాట కాదని వారితో గడిపేందుకు ప్రయత్నిస్తే గుట్టు మొత్తం రట్టు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేయాలో పాలుపోని ఆ మహిళ అసలు విషయం నలుగురు వృద్ధులకు చెప్పింది. తమ వ్యవహారం బయట పడుతుందని అంతా భయపడ్డారు. చివరికి తృపిత్ శర్మను కడతేర్చాలని ఫిక్స్ అయ్యారు. ఓరోజు శృగారం కోసమని తృపిత్ శర్మని పిలిచారు. అతను ఇంటికి వచ్చాక అందరూ కలిసి రాళ్లతో కొట్టి అతడిని హత్య చేశారు. మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. ఐదురోజులైనా తండ్రి ఇంటికి రాకపోవడంతో తృపిత్ శర్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫోన్ కాల్స్ డేటా ప్రకారం పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.