దేశంలో అత్యాచార ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గుడి, బడి అని తేడా లేకుండా దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బాలికలపై అత్యాచార దాడులకు తెగబడుతున్నారు. చివరికి ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి చెరిగిపోని మచ్చ తెస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఉపాధ్యాయుడు 10వ తరగతి బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేసి చివరికి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిచ్చయ్య అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అలా రోజూ స్కూలుకు వస్తూ పోతున్న క్రమంలోనే పిచ్చయ్య ఓ 10వ తరగతి బాలికపై ఎప్పటి నుంచో ఓ కన్నేశాడు. ఎలాగైన ఆ బాలికను లోబర్చుకోవాలని చూశాడు. ఇందులో భాగంగానే ఆ మాస్టారు నా కోరిక తీర్చాలని, లేకుంటే పరీక్షల్లో నిన్ను ఫెయిల్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇలా ఎన్నోసార్లు ఆ బాలికను బెదిరించి అనేక సార్లు అత్యాచారం చేశాడు. అయితే ఇటీవల ఆ బాలికకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. ఈ వార్త విన్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరిగిందని ఆ బాలికను ప్రశ్నించగా.. ఆ బాలిక అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.