సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వైపు భార్యలు తమ పడక సుఖం కోసం భర్తలు అడ్డుగా ఉన్నారని దారుణంగా హత్య చేస్తుంటే.., మరో వైపు భర్తలు అనుమానంతో భార్యలను హత్య చేసేందుకు కత్తులు నూరుతున్నాయి. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి అడుగులు వేసిన ఓ దుర్మార్గపు భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన చర్య స్థానికుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది.
అసలు కట్టుకున్న భార్యను భర్త అంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటన్న పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగుళూరులో హగరిబొమ్మనహళ్లి పరిధిలోని బ్యాసగదేరి. ఇదే గ్రామానికి చెందిన రవి కుమార్ (32) తన దగ్గరి బంధువులు కుమార్తె అయిన దీప(21)ను వివాహం చేసుకున్నాడు. వీరికి పెళ్లి జరిగి ఏడాదిన్నర కావస్తుంది. పెళ్లైన కొంత కాలం పాటే ఈ దంపతులు సంతోషంగా జీవించారు. ఇక రవి కుమార్ నిత్యం ఏదో ఒక గొడవ చేస్తూ భార్య దీపను అనుమానంతో వేధిస్తుండేవాడు. అలా వీరి దాంపత్య జీవితంలో సంతోషం దూరమై.., వివాదాలు, మనస్పర్దలు దగ్గరయ్యాయి. ఈ నేపథ్యంలోనే తరుచు గొడవలు జరుగుతుండేవి.
ఇక రవి కుమార్ ప్రవర్తనపై స్థానికులు సైతం విసిగిపోయి వీడు మొగుడు కాదు, యముడు అనే రీతిలో మాట్లాడుకునేవారు. అయితే సోమవారం రాత్రి కూడా ఈ దంపతులు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త రవి కుమార్ కట్టుకున్న భార్య అని చూడకుండా దుర్మార్గుడిలా ప్రవర్తించాడు. ఇక ఇంతటితో ఆగకుండా రవికుమార్ క్షణికావేశంలో దీప గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం తన భార్య శవాన్ని తీసుకెళ్లి అదే గ్రామంలో ఉంటున్న అత్తమామల ఇంటి వదిలేసి పారిపోయాడు. అనంతరం కూతురి శవాన్ని చూసిన దీప తల్లిదండ్రులు కన్నీరు మున్నిరుగా విలపించారు. ఇక భర్త దారుణంపై దీప తల్లిదండ్రులు భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి కుమార్ తో పాటు అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.