ఈ మధ్యకాలంలో నవ వధువులు ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆవేదనకు గురి చేస్తోంది. కారణాలు వేరైనా ఆత్మహత్యే మార్గమంటూ చివరికి కన్నవాళ్లకు తీరని శోకాన్నిమిగిల్చిపోతన్నారు. మరీ ముఖ్యంగా వరకట్న వేధింపులతో నవ వధువలు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా బెంగళూర్ కి చెందిన ఓ నవ వధువు పెళ్లైన నాలుగు నెలలకు ఆత్మహత్య చేసుకోవడం అనేది స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈ యువతికి అంజన్ కణియార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే వారిరువురి పెద్దలను ఒప్పించి నాలుగు నెలల కిందట ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Software Woman: అందమైన భార్య! అందమైన జీవితం! కానీ.., భార్యని డబ్బు కోసం!
కాగా పెళ్లైన కొన్నిరోజులు బాగానే ఉన్న సంజుకి కొన్నాళ్లకే అత్తింటివాళ్లు వరకట్నం తేవాలంటూ వేధించేవారని తెలుస్తోంది. ఇష్టపడి చేసుకున్న వ్యక్తి ఇంట్లోనే ఇలాంటి వేధింపులు ఎదురవడంతో సంజు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక దీనికి తోడు తరుచు వేధించే వెన్ను నొప్పితో నరకం చూసేది. వీటన్నిటిని భరించలేని సంజు శనివారం ఎవరూ లేని సమయంలో.. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఇష్టపడే ఆత్మహత్య చేసుకొంటున్నాను క్షమించు అమ్మా. నా మనస్థితి సరిగా లేదు. నేను ఏమి చేస్తున్నానో నాకే తెలియడం లేదు. వెన్ను నొప్పిగా ఉంది అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సంజు తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విగతజీవిగా వేలాడుతున్న కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. భర్తతో పాటు అత్తింటి వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని సంజు తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.