మద్యం మత్తు మనిషిని ఎంత దాకైన తీసుకెళ్తుంది. తాగిన మైకంలో నిజాలు బయటపెట్టడంతో దారుణాలకు కూడా వెనకాడరు. సరిగ్గా ఇలాగే మద్యం మత్తులో బరితెగించిన కొందరు యువకులు రెస్టారెంట్ లో ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ఫైటింగ్ చేసుకున్నారు. దీనిని గమనించిన మరికొందరు యువకులు సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. అయితే రెస్టారెంట్ లో ఆ యువకులు ఎందుకు దాడి చేసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్నాటక రాజధాని అయిన బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కొందరు యువకులు తాగిన మత్తులో రాత్రి 11.00 గంటల ప్రాంతంలో విలేజ్ రెస్టారెంట్ లోకి ప్రవేశించారు. తమకు కావాల్సిన ఆహారం ఇవ్వాలంటూ రెస్టారెంట్ నిర్వాహకులను కోరారు. అయితే దీనికి నిరాకరించిన రెస్టారెంట్ నిర్వాహకులు.. రాత్రి 11.00 దాటితే ఎలాంటి ఆర్డర్ లు తీసుకోమని, అందరూ బయటకు వెళ్లాలని కోరారు. లేదు.. లేదు.. మా ఆర్డర్ ఇప్పుడు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టి కూర్చున్నారు. అయితే ఆ యువకులు తాగిన మత్తులో ఉండడంతో కాస్త గొడవ చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకులు ప్రవర్తనతో విసుగు చెందిన రెస్టారెంట్ నిర్వాహకులు యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అయినా వినని ఆ యువకులు కాస్త దూకుడుగా ప్రవర్తించి రెస్టారెంట్ నిర్వాహకులపై దాడి చేశారు. ఇక తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ నిర్వాహకులు మద్యం మత్తులో ఉన్నయువకులపై ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరి దాడులు చేసుకున్నారు. అయితే దీనిని అంతా గమనిస్తున్న మరికొందరు యువకులు తమ సెల్ ఫోన్ లలో వీడియోలు తీశారు. ఇక ఇంతటితో ఆగకుండా అదే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఇక చివరికి ఆ వీడియోలు పోలీసుల వరకు వెళ్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.
Brawl at village restaurant in Electronic City, Bangalore. Gang attacks hotel staff as they said last order is at 11pm and you’ve reached at 11:20pm and food can’t be served.
5 arrests made so far, identity of the remaining being ascertained. pic.twitter.com/RBFa4IPwyN
— Nagarjun Dwarakanath (@nagarjund) December 1, 2022