ఈ మధ్య కాలంలో దొంగలు తమ బుర్రకు బాగా పదును పెడుతున్నారు. తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. అక్కడా ఇక్కడ దొంగతనం చేయటం ఎందుకనుకున్నారో ఏంటో తెలియదు కానీ, కొందరు దొంగలు ఏకంగా ఏటీఎమ్ సెంటర్నే టార్గెట్ చేశారు. గతంలోలా ఏటీఎమ్ మిషిన్ను పగుల కొట్టడం లాంటివి చేయకుండా.. ఏకంగా ఏటీఎమ్ మిషిన్నే తీసుకెళ్లిపోయారు. అది కూడా 10 సెకన్లలో దాన్ని బొలెరో వాహనంలో వెసుకెళ్లిపోయారు. ఈ సంఘటన రాజస్తాన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
రాజస్తాన్లోని జోద్పూర్, శిఖర్ఘర్ మినీ మార్కెట్లో ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఏటీఎమ్ మిషిన్ ఉంది. ఆ ఏటీఎమ్ మిషిన్ ఎప్పుడూ జనంతో కలకల్లాడుతూ ఉంటుంది. అది కూడా పగలు మాత్రమే. రాత్రి అయితే అక్కడికి ఎవ్వరూ రారు. దొంగలు ఆ ఏటీఎమ్ మిషిన్ టార్గెట్ చేశారు. పక్కాప్లాన్తో మంగళవారం రాత్రి రంగంలోకి దిగారు. రాత్రి 1 గంట ప్రాంతంలో అన్ని సిద్ధం చేసుకుని సెంటర్ దగ్గరకు వచ్చారు. ఎంతో నైపుణ్యంతో ఏటీఎమ్ను పీకి బయటకు తెచ్చారు. తర్వాత పది సెకన్లలో దాన్ని బొలెరో వాహనంలో వేసుకుని వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన వారు విచారణ మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు మిషిన్ను వాహనంలో వేసుకుపోతున్న దృశ్యాలు వారికి కనిపించాయి. మరింత సమాచారం కోసం మరిన్ని సీసీటీవీ ఫుటేజీలను చూస్తున్నారు. కేసు కూడా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగలు మిషిన్ను వాహనంలో వేసుకుపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
10 सेकेंड में बोलेरो से बांधकर ATM उखाड़ ले गए चोर pic.twitter.com/9oGoqCGYBN
— News Track (@newstracklive) November 30, 2022