నేటి కాలం యువత చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రియుడు మోసం చేశాడని, చదువుల్లో రాణించలేకపోతున్నాననే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ చివరికి.. కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ బాలిక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకు పరిష్కారమే లేదన్నట్లుగా ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. కారణాలు వేరైనా.. రోజుకు ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువుల్లో రాణించలేకపోతున్నానంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ బాలిక.. తాజాగా గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవలస గ్రామం. ఇక్కడే ముమ్మిన వెంకట చిరంజీవి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె సాయిశ్రీ (17) బోయపాలెంలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంటర్ చదువుతూ హాస్టల్ లోనే ఉంటుంది. అయితే గత కొంత కాలం నుంచి సాయిశ్రీ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షలు ఉండడంతో అనారోగ్యం కారణంతో అనుకున్న స్థాయిలో చదవలేకపోయింది. దీంతో పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. నేను ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో మార్కులు సాధించలేనని తరుచు బాధపడుతూ ఉండేది.
కట్ చేస్తే.. మార్కులు తక్కువగా వస్తే ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ముందు తల ఎత్తుకోలేను. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. చెల్లి.. బాగా చదువుకుని అమ్మానాన్నలకు మంచి పేరును తీసుకురా. అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ.. సాయిశ్రీ సూసైడ్ నోట్ రాసి మంగళవారం సాయంత్రం ఉంటున్న గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది వెంటనే సాయిశ్రీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం ఇదే విషయాన్ని సాయిశ్రీ తల్లిదండ్రులకు వివరించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయిశ్రీ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు రావని ఆత్మహత్య చేసుకుంటున్న ఇలాంటి వారికి మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.