తెలంగాణలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు కస్టడీలో నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు మైనర్లను, ఒక మేజర్ ను విడివిడిగా విచారించినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు.
శనివారం నలుగురు నిందితులను పోలీసులు, కస్టడీలో విచారించారు. A1 సాదుద్దీన్ మాలిక్తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మైనర్లు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో మైనర్లు తమ తప్పులేదని.. తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని.. ఆ తరువాతే లైంగిక దాడికిపాల్పడ్డామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పాడని పోలీసులు అంటున్నారు. దీంతో ఏది నిజమో తెలియక పోలీసులు గందరగోళానికి లోనవుతున్నారు.
బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే తనయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని, అనంతరం మేము అనుసరించామని స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. కాన్స్ బేకరి నుండి మార్గం మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడని, బెంజ్ కార్ కాన్స్ బేకరిలో పార్క్ చేసి ఇన్నోవాలో ఐదుగురం వెళ్ళామని స్టేట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు. ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా ఎస్కేప్ అయ్యామని, ఎక్కడకు ఎస్కేప్ అవుతున్నాము అన్న విషయం ముందుగా డిసైడ్ కాలేదు అని చెప్పినట్లుగా పోలీసులు చెప్తున్నారు. వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో.. శనివారం కేవలం గంటసేపు మాత్రమే నిందితులను విచారించినట్టు ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.