ఫోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ బడా నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. గత రెండు నెలల పాటు జైళ్లో ఉంటున్న ఇతనికి ముంబై కోర్టు ఎట్టకేలకు కోర్టు రూ.50 షూరిటితో అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక గత కొంత కాలం నుంచి రాజ్ కుంద్రాపై యువతుల నగ్న వీడియోలు తీసి వ్యాపారం చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో రెండు నెలల పాటు జైళ్లో ఉన్న రాజ్ కుంద్రా కాస్త ఊరటనిస్తూ బెయిల్ ను మంజూరు చేయటం విశేషం. విడుదల అనంతంర మీడియాతో మాట్లాడిన ఆయన ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసరంగా నన్ను జైలుకు పంపారని ఆవేధన వ్యక్తం చేశారు.