సైదాబాద్ ఘటనలో నిందితుడుగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకుని రైళు పట్టాలపై శవమై తేలాడు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ బాడీ రాజుదేనంటూ టాటూ ఆధారంగా నిర్ధారించినట్లు పోలీసులు అధికారికంగా తెలిపారు. దీంతో ఓ పక్క రాజు కుటుంబికులేమో పోలీసులే కావాలనే చంపారనే అంటుంటే మరోపక్క బాధిత కుటుంబ సభ్యులు మాత్రం అది రాజు బాడీ అవునో కాదో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఈ నేపథ్యంలో నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు ఘటన స్థలం నుంచి వరంగల్ లోని ఎంజీఎంకు ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడున్న రాజు కుటుంబ సభ్యులు మాత్రం అతని శవాన్ని చూడటానికి ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే రాజు ఉన్న అంబులెన్స్ పై స్థానికులు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. నిందితుడికి సరైన గతి పట్టిందని వాపోయారు.