ఆంధ్రప్రదశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీమల్లిఖార్జున స్వామి దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. అయితే కొంత మంది భక్తులు భక్తపారవశ్యంతో రోడ్డుపై నల్లమల్ల ఫారెస్ట్ గుండా నడక దారిలో శ్రీశైలానికి వెళ్తుంటారు. అలా నడక దారిలో వెళ్తున్న కొంతమంది భక్తులకు హఠాత్తుగా పెద్ద పులి దర్శనమిచ్చింది. దానిని చూసిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
వెంటనే భయంతో పరుగులు తీస్తూ రోడ్డుపై పరుగెత్తారు. కొద్దిసేపు ఆ పులి వారిని వెంబడిస్తూ ముందుకు కదిలింది. దీంతో ఆ భక్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు భక్తులకు రక్షణ కల్పించారు. ఈ ఘటనతో భక్తులు ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు.