పరిస్థితులు మనుషులును ఎంతకైన తెగించేలా చేస్తున్నాయి. సమాజంలో తల్లిదండ్రులు కన్న పిల్లలపై కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చెంచుగూడెంలో బయ్యన్న అనే వ్యక్తి మద్యానికి బానిసై ప్రతీ రోజు తాగుతూ తాగుబోతుగా తయారయ్యాడు. ఇక మద్యానికి డబ్బుల్లేక మధ్యవర్తుల సాయంతో నెలన్నర వయసున్న కొడుకును అమ్మేశాడు.
ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో ఘాతుకం వెలుగు చూసింది. తన కన్న పిల్లలను కుటుంబ కలహాలతో గొంతు నులుమి చంపేసింది. జిల్లా సమీపంలోని జ్యోత్స్న అనే ఓ మహిళకు దేవాన్ష్ (6) రుద్రాంష్ (7) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్పి రోజుల వరకు సంతోషంగా గడిచిన ఆమె జీవితం ఉన్నట్టుండి మారి పోయింది. తన ఇద్దరు పిల్లలను చంపాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే పథకం ప్రకారం ఇద్దరు పిల్లలను కొంతు నులిమి చంపేసింది.
ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు జ్యోత్స్న సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు హత్య, ఆత్మహత్య వివరాలపై విచారణ చేపడుతున్నారు. కుటుంబకలహాలే వల్లే తాను అలా చేసి ఉండవచ్చిన స్థానికులు చెబుతున్నారు.