దేశవ్యాప్తంగా ఎన్నో ప్రవేట్ బ్యాంకులు కస్టమర్లకు సర్వీస్ లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త స్కీమ్ లను సైతం ఖాతాదారుల కోసం తీసుకొస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కస్టమర్లపై భారాన్ని సైతం మోపుతుంటాయి బ్యాంకులు. సెక్యూరిటీ రీజన్ లో భాగంగా ప్రముఖ బ్యాంక్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే? డిసెంబర్ 1వ తేది నుంచి SMS బ్యాలన్స్ అలర్ట్ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఖాతాదారులు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణంగా మనం మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవాలంటే గతంలో బ్యాంక్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ మారిన టెక్నాలజీలో భాగంగా ఇప్పుడు మన అరచేతిలో ఉన్న ఫొన్ లోనే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవచ్చు. అయితే చాలా బ్యాంక్ లు తమ కస్టమర్లకు బ్యాలెన్స్ అలర్ట్ ఎస్ఎంఎస్ లను పంపుతుంటాయి. ఇప్పుడు ఈ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన ‘యస్ బ్యాంక్’. 2022 డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఖాతాదారులు SMS అలర్ట్ ప్యాకేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ.. వారికి కూడా ఇక నుంచి బ్యాలెన్స్ అలర్ట్ ఎస్ఎంఎస్ లు రావని స్పష్టం చేసింది. అయితే ఇతర విషయాలకు సంబంధించిన ఎస్ఎంఎస్ లు మాత్రం వస్తాయని పేర్కొంది.
ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే.. కస్టమర్లు యస్ మెుబైల్, యస్ ఆన్ లైన్, యస్ రోబోట్ వంటి ఇతర ఆన్ లైన్ మార్గాల ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అయితే కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా SMS సౌకర్యాలను కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ఎలా చేసుకోవాలి అంటే? ఫస్ట్ మీరు యస్ ఆన్ లైన్ లోకి వెళ్లి.. అక్కడ మీ ఐడీ, పాస్ వర్డ్ తో నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలి. నెక్ట్స్ మెనూ పై క్లిక్ చేసి, మేనేజ్ ప్రోఫైల్ లోకి వెళ్లాలి. అక్కడ అలర్ట్స్ అనే ఆప్షన్ ను మీరు ఎంచుకోవాలి. తర్వాత మీ అకౌంట్ ఏ టైపో గుర్తించి, అలర్ట్స్ ను రిజిస్టర్ లేదా డీ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఏ అలర్ట్స్ లను మార్చాలి అనుకుంటున్నారో వాటిని గుర్తించి తర్వాత సేవ్ చేసుకోవాలి. అందువల్ల యస్ బ్యాంక్ లో ఖాతా కలిగిన కస్టమర్లు ఈ కొత్త రూల్స్ ను గుర్తుంచుకోవాలని సంబంధిత బ్యాంక్ వర్గాలు సూచిస్తున్నాయి.