భారతీయ సంప్రదాయంలో, సమాజంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంత పేదవారైనా సరే.. ఒంటి మీద వీసమెత్తు బంగారం అయినా ఉండాలని కోరుకుంటారు. ఇక మన వివాహ వ్యవస్థతో బంగారానికి విడదీయరాని బంధం ఉంది. స్టేటస్ సింబల్ గానే కాక.. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకుంటుందనే ఉద్దేశంతో చాలా మంది బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు. కరోనా తర్వాత చాలా మంది పుత్తడి రూపంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ లో చాలా లోహాలున్నప్పటకి.. బంగారానికే అంత క్రేజ్ ఎందుకు.. ధర కూడా ఇంత భారీగా ఉండటానికి కారణం ఏంటి.. అసలు బంగారం ధరని ఎవరు నిర్ణయిస్తారు వంటి తదితర వివరాల కోసం ఇది చదవండి.
సాధారణంగా ఏ దేశ కరెన్సీని ఆ దేశంలోనే వినియోగించాలి. అమెరికా డాలర్ను పలు ఇతర దేశాల్లోనూ అనుమతిస్తారు. బంగారం విషయంలో అలా కాదు. ఏ దేశమైనా బంగారంతో లావాదేవీలు చేయొచ్చు. అందుకే దానికి అంత డిమాండ్.
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు..
బంగారం ధరను ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ నిర్ణయించదు. సాధారణ మార్కెట్పై ఆధారపడి బంగారం ధర ఉంటుంది.బంగారం ధర ఎక్కువగా ఉండేందుకు పలు కారణాలు ఉన్నాయి. దీని మైనింగ్ కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంగారం ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా ఖర్చుతో కూడుకున్నది. సాధారంగా డిమాండ్ పెరిగినా.. ఉత్పత్తి అంతే స్థాయిలో ఉంటే దాని ధర పెరుగుతుంది. పారిశ్రామికీకరణతో బంగారం ప్రాసెసింగ్ సులభమైనప్పటికీ.. బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువ అవుతుంది. దీనితో ధర ఎక్కువగా ఉంటుంది. ఒక స్థాయిలో బంగారం ఉత్పత్తి జరగకపోవచ్చు. దీనితో బంగారం కొనుగోలు చేయాలంటే ఒకరి నుంచి ఒకరికి బదిలీ మాత్రమే కావాలి. దీనితో సాధారణంగానే ధర పెరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.