Update your Aadhaar data: ప్రజలారా గమణించండి. భారతదేశపు అత్యంత విశిష్ట గుర్తింపు కార్డుగా భావించే ఆధార్ లో కీలక మార్పులు జరిగాయి. ఈ మేరకు ఆధార్ కార్డును జరీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆదేశాలు ఇచ్చింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం, 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు మాత్రమే బయోమెట్రిక్ ను అప్డేట్ తప్పనిసరిగా ఉంది. యూఐడీఏఐ తాజా నిర్ణయంతో.. ఇప్పుడు వయోజనులు కూడా తప్పనిసరిగా ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిందే.
ప్రస్తుతం ఆధార్ కార్డు చాలా కీలమైన డాక్యుమెంట్. ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయిన రోజులు. బ్యాంక్ లో ఖాతా తెరవాలన్నా.. మొబైల్ సిమ్ తీసుకోవాలన్నా.. కరెంట్ కనెక్షన్ కావాలన్నా.. పిల్లాడిని స్కూల్లో చేర్పించాలన్నా.. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందాలన్నా.. వయసు మళ్ళిన వారికి పింఛన్ రావాలన్నా.. .. ఇలా ఒకటేమిటి.. అన్ని పనులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఈ తరుణంలో ఆధార్ వినియోగంపై ప్రజలకు కాస్త అవగాహన అవసరం. ఎవరికైనా మీ ఆధార్ కార్డును ఇచ్చేముందు కాస్త ఆలోచించండి. ఇప్పుడు ఆధార్ లో చోటుచేసుకున్న కీలక మార్పులేంటో చూద్దాం.. దేశ పౌరులకు ఆధార్ కార్డును జరీ చేసే యూఐడీఐఏ ఓ కీలక సూచన చేసింది. ప్రతి పదేండ్లకు ఒకసారి ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్డేేట్ తప్పనిసరిగా ఉంది. ఇకపై.. వయోజనులు కూడా తమ ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే.. 70 ఏండ్లు దాటిన వారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.
“దేశంలో మేఘాలయ, నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఉన్న వయోజనుల ఆధార్ అప్డేట్ చేశామని తెలిపింది. ఎన్ఆర్సి కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగిందనీ, అలాగే.. నాగాలాండ్, లద్దాఖ్లోని పలు ప్రాంతాలలో కొంత మందికి కార్డులు మంజూరు చేయాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 93.5 శాతం మంది ఆధార్ కలిగి ఉన్నారనీ, ఈ ఏడాది ఆగస్టులో 24.2 లక్షల మందికి ఆధార్ అందజేశామని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 50,000 ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఉన్నాయని, అందుకోసం 1,50,000 మంది తపాల సిబ్బందిని ఉపయోగిస్తున్నట్టు తెలిపింది”.
“ఆధార్ అప్ డేట్ చేయడం వల్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించి.. నిధులు దుర్వినియోగం కాకుండా చేయవచ్చనేది యూఐడీఏఐ అభిప్రాయం. ప్రస్తుతం ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదుకు బయోమెట్రిక్ సేకరించడం లేదు. బదులుగా UIDAI ఫేషియల్ స్కాన్ మరియు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బయోమెట్రిక్ ప్రమాణీకరణను ఉపయోగించి చిన్న పిల్లలను నమోదు చేస్తుంది. అయితే, ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు తమ బయోమెట్రిక్లను ఆధార్ సేవా కేంద్రంలో అందించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రతి పదేండ్లకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేయాల్సిందేనన్న యూఐడీఏఐ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.