పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గింది. గత పది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా పసిడి ధర పడిపోతుంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం కొనే వారికి శుభవార్త. అక్షయ తృతీయ రోజున పెరిగిన బంగారం ధర ఇవాళ మాత్రం దిగొచ్చింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చెప్పి చాలా మంది రేటు పెరిగినా కూడా అస్సలు తగ్గలేదు. అయితే నిన్న కొనలేదని బాధపడేవారికి ఇది నిజంగా శుభవార్తే. ఈరోజు బంగారం ధర తగ్గింది. బంగారం మాత్రమే కాదు వెండి కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. దేశీయంగా కూడా ఈ ధరలు పతనమయ్యాయి. గత పది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చూస్తున్నాం. ఒకరోజు పెరగడం, తర్వాత రోజు తగ్గడం చూశాం. తాజాగా ఇప్పుడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1983 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. మూడు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 20న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1993 డాలర్లుగా ఉంది. ఈ మూడు రోజుల్లో 10 డాలర్లు పతనమైంది. ఇక ఔన్సు వెండి ధర ప్రస్తుతం 25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మూడు రోజులుగా వెండి ధర స్థిరంగా ఉంది. అయినప్పటికీ దేశీయంగా వెండి ధర తగ్గింది. అలానే బంగారం కూడా దిగొచ్చింది. పది రోజులుగా బంగారం ధరలు పరిశీలిస్తే.. ఏప్రిల్ 13న 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల వద్ద రూ. 56,100 వద్ద ఉంది. ఏప్రిల్ 14న సరాసరి రూ. 550 పెరిగి రూ. 56,650కి చేరుకుంది. ఏప్రిల్ 15న రూ. 700 తగ్గగా, ఏప్రిల్ 16న రూ. 10, ఏప్రిల్ 18న రూ. 90 తగ్గింది.
అయితే ఏప్రిల్ 19న రూ. 200 పెరగగా.. ఏప్రిల్ 20న మాత్రం రూ. 200 తగ్గింది. ఏప్రిల్ 21న మళ్ళీ రూ. 200 పెరిగింది. నిన్న అంటే ఏప్రిల్ 22న రూ. 300 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే గడిచిన 10 రోజుల్లో ఒకరోజు తగ్గడం, మరొక రోజు పెరగడం ఇలా బెట్టు చేస్తూ వచ్చింది. ఏప్రిల్ 13న రూ. 61,200 ఉండగా, ఏప్రిల్ 14న రూ. 600 పెరుగుదలతో రూ. 61,800కి చేరుకుంది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో మాత్రం రూ. 770 తగ్గింది. ఏప్రిల్ 17న ఎటువంటి మార్పు లేదు. ఏప్రిల్ 18న రూ. 110 తగ్గగా.. ఏప్రిల్ 19న రూ. 230 పెరిగింది. ఏప్రిల్ 20న రూ. 220 తగ్గగా.. ఏప్రిల్ 21న రూ. 220 పెరిగింది. ఏప్రిల్ 22న రూ. 330 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం రూ. 60,820కి చేరుకుంది.
ఇక వెండి ధర చూసుకుంటే గత పది రోజులుగా బాగా పెరుగుతూ వచ్చింది. తగ్గినా కూడా తక్కువే తగ్గింది. ఏప్రిల్ 13న కిలో వెండి ధర ఏకంగా రూ. 400 పెరిగి రూ. 81,800 అయ్యింది. ఏప్రిల్ 14న అయితే సరాసరి రూ. 1200 పెరిగి 83 వేలకు చేరుకుంది. ఏప్రిల్ 15న రూ. 1500 తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్ 17న రూ. 100 పెరగగా.. ఏప్రిల్ 18న రూ. 1100 తగ్గింది. దీంతో వెండి రూ. 80,500 వద్ద ఉంది. ఏప్రిల్ 19న రూ. 500 పెరుగుదలతో 81 వేలకు చేరుకుంది. ఏప్రిల్ 21న రూ. 300 పెరుగుదలతో రూ. 81,300కి చేరింది. ఏప్రిల్ 22న రూ. 900 తగ్గుదలతో రూ. 80,400కి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,400 వద్ద కొనసాగుతోంది.