సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది.
జాబ్ చేసే ఆలోచన లేదు.. సొంత ఊరిని విడిచి దూరంగా పట్నం వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఊరిలో ఉపాధి మార్గాలు తక్కువ.. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే.. కనీసం లక్ష రూపాయాలైనా పెట్టుబడి పెట్టాలి.. కానీ అంత మొత్తం చేతిలో లేదు… ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. తగిన సొమ్ము లేక బాధపడుతున్న వారి కోసం ఓ బంపరాఫర్ ప్రకటించింది. సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చేందుకు రెడీగా ఉంది ఎస్బీఐ. ఇంతకు ఈ లోన్ పొండానికి అర్హతలు ఏంటి.. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి.. తదితర పూర్తి వివరాలు ఇక్కడ..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది. కాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్గా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాక్ కూడా.. ముద్ర యోజన కింద వ్యాపారం చేయాలనుకునేవారికి బిజినెస్, వర్కింగ్ కాపిటల్ లోన్స్ అందిస్తుంది. ముద్ర యోజన కింద ఎస్బీఐ 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది. ఐదేళ్లలోపు తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తుంది.
ఒక్కరే సొంతంగా వ్యాపారం చేయాలనుకువారికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రలు స్థాపించాలనుకునేవారికి, తయారీ, ట్రేడింగ్ రంగాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు ఎస్బీఐ ముద్ర, ఇ-ముద్ర లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఉన్నవారు ఈ ఎస్బీఐ ముద్ర లోన్స్కు అర్హులు. మరి ఎస్బీఐ ఇ ముద్ర యోజనకు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు..