భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్లపై ఎస్ఎంఎస్ ఛార్జీలను పూర్తిగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కస్టమర్లు ఇకపై ఎలాంటి ఛార్జీలు లేకుండా USSD సర్వీసులు పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఖాతాదారులపై ఇక నుంచి తక్కువ భారాన్ని విధించనున్నామని, మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్లు మరింత అఫర్డబుల్గా అందుబాటులోకి రానున్నాయని ఎస్బీఐ ప్రకటన చేసింది. “మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్లపై ఉన్న ఎస్ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేశాం. ఇక నుంచి యూజర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ లావాదేవీలను చేసుకోవచ్చు” అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అందుకు సంబంధించిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ను కూడా షేర్ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఫీచర్ ఫోన్లు వాడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు అధిక ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SMS charges now waived off on mobile fund transfers! Users can now conveniently transact without any additional charges.#SBI #StateBankOfIndia #AmritMahotsav #FundTransfer pic.twitter.com/MRN1ysqjZU
— State Bank of India (@TheOfficialSBI) September 17, 2022