లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క పైసా తగ్గినా లక్షలు కలిసొచ్చినట్లు మిడిల్ క్లాస్ జీవితాలు అందరివీ. ఒక్క రూపాయి తక్కువకి పెట్రోల్ దొరుకుతుందంటే కిలోమీటర్ లైన్ ఉన్నా కూడా ఆలోచించకుండా రోజంతా నిలబడగలిగే స్టామినా ఉన్న మనుషులు మిడిల్ క్లాస్ మనుషులు. ఏ హర్ష సాయి లాంటి వ్యక్తో ఉచితంగా పెట్రోల్ కొట్టిస్తుంటే బండ్లు, ఖాళీ టిన్ లు పట్టుకుని ఎగబడి వెళ్లే మనుషులున్న ఈ సొసైటీ ఆఫ్ ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయంటే వీరి కంటే ఆనందించే మనుషులు ఈ భూ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. కొంతమంది ఉంటారులెండి, ‘నువ్వు లీటర్ పెట్రోల్ మీద రూపాయి పెంచుకో, అర్ధ రూపాయి తగ్గించుకో.. నాకేం బాధ లేదు, ఎందుకంటే నేను కొట్టించేది వంద రూపాయలే’ అని అనుకునే వారు. ఇలాంటి వారి సంగతేమో గానీ పెట్రోల్ ని, డీజిల్ ని పొదుపుగా వాడే ప్రేమికులు ఉంటారు. అలాంటి వారికి చమురు ధరలు తగ్గితే నిజంగా శుభవార్తే మరి.
ఇప్పటికే ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ. 115 తగ్గించి చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పాయి. తాజాగా పెట్రోలియం కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారం రోజులు లోపు దీనిపై ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దశలవారీగా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కి రూ. 2 చొప్పున తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ముందు చమురు ధరలు 40 పైసలు తగ్గించనున్నాయని కథనాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా చూసుకుంటే అక్టోబర్ 31న చమురు ధరలు తగ్గాయి. ఇవాళ (నవంబర్ 1న) పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందూస్తాన్ పెట్రోలియం వంటి కంపెనీలు చమురు ధరలను సవరించకుండా అంతకు ముందున్న ధరలనే ఉంచాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.67 ఉండగా, డీజిల్ ధర రూ, 97.82 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 102.63 ఉండగా, లీటర్ డీజిల్ రూ. 94.24 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 101.94 కాగా, డీజిల్ లీటర్ ధర రూ. 87.89 ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.72 కాగా, డీజిల్ లీటర్ ధర రూ. 89.62 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 106.31 ఉండగా, లీటర్ డీజిల్ రూ. 97.28 ఉంది. గత ఐదారు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఏడాది మే నెలలో లీటర్ పెట్రోల్ పై రూ. 8, లీటర్ డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే.
మరోసారి కేంద్రం ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే సామాన్యులకి ఊరట లభిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు భారమవుతుంది. అలాంటి తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే కొంచెం భారం తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తుందా? ఆయా పెట్రోలియం కంపెనీలు ధరలను తగ్గిస్తాయా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.
Petrol and Diesel prices likely to be cut by Rs 2/ltr
40 paise reduction possible tomorrow – Details!#FuelPrices #PetrolPrice #DieselPrice https://t.co/l9oloW77Se
— Zee Business (@ZeeBusiness) October 31, 2022