వయస్సులో ఉన్నప్పుడు ఎంత సంపాదించినా, వృద్ధాప్యం వచ్చాక మన పరిస్థిఇతి ఎలా ఉంటుందో మనకే తెలియదు. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది భయం వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎలా జీవించటం అన్నదే. ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే మంచి ప్లానింగ్ అవసరం. అయితే మనలో ఎంతమంది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు? అన్నది గమనించవలసిన విషయం. ఇప్పుడు మీకు చెప్పబోయేది.. వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసానిచ్చే అద్భుతమైన పథకం గురుంచి..
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన ఒకటి. అసంఘటిత రంగంలోని వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా అల్పాదాయ వర్గాల వారికి, తక్కువ వేతనాలు పొందే వారికి, మహిళలు, స్వయం ఉపాధి పొందే వారికి ఈ పథకం ఎక్కువ ప్రయోజనకరమని చెప్పుకోవచ్చు. ఇందులో నెలకు రూ.55 పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ఏడాదికి రూ.36,000 పెన్షన్ పొందవచ్చు.
Assurance of old age protection and #SocialSecurity for unorganised workers through Pradhan Mantri Shram-yogi Maan-dhan (PMSYM) Pension Yojana. To register, visit https://t.co/qzBx0cdoLC or go to your nearest Common Service Centre.#PMSYM pic.twitter.com/4RLB8KcvlD
— Ministry of Labour (@LabourMinistry) December 14, 2021
అర్హతలు:
కావాల్సిన డాక్యుమెంట్లు:
ప్రయోజనాలు:
పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్ ప్రత్యేకతలను గమనిస్తే.. అర్హత కలిగిన వారు పథకంలో ఎవరైనా చేరొచ్చు. ఇది స్వచ్ఛంద పెన్షన్ పథకం. పథకంలో చేరిని వారికి కచ్చితమైన పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు నిండిన తరువాత ప్రతి నెలా రూ.3,000 పింఛను అందజేస్తారు. అర్హులైన భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే.. రూ.72,000 పెన్షన్గా పొందవచ్చు. ఒకవేళ పథకంలో చేరిన వారు మరణిస్తే.. అప్పుడు వారి భాగస్వామికి సగం పెన్షన్ వస్తూనే ఉంటుంది. లేదంటే డిపాజిట్ చేసిన డబ్బులను వెనక్కి పొందొచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు..?
రూ.55 నుంచి రూ.200 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు నెలకు రూ.55 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే.. 30 ఏళ్లు ఉంటే.. నెలకు రూ.100, 40 ఏళ్లు ఉంటే.. నెలకు 200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 18 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టే వ్యక్తి 42 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ లభిస్తుంది.
పథకంలో ఎలా చేరాలి?
ఈ పథకంలో చేరాలని భావించే వారు మాన్ ధన్ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఈ పథకంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.