మోసపూరిత ఏటీఎం లావాదేవీల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏటీఎంలలో పెరిగిపోతున్న అక్రమ లావాదేవీలు, మోసాల్ని నివారించేందుకు ఎస్బీఐ ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్బీఐ ఒక్కటే ఈ పద్ధతి అమలు చేస్తోంది. త్వరలో మిగిలిన బ్యాంకులు కూడా ఇదే పద్ధతి అమలు చేయనున్నాయి. అంటే ఇంతకుముందులా సులభంగా కార్డు పెట్టి డబ్బులు తీయలేరు.
ఎస్బీఐ కస్టమర్లైతే ప్రస్తుతం ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసే సమయంలో నాలుగంకెల ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు హోల్డర్ ఉన్నారో..ఆ వ్యక్తి రిజస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఈ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఒకసారికే పనిచేస్తుంది. రెండవసారి విత్డ్రా చేయాలంటే మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఈ పద్ధతిని ఎస్బీఐ జనవరి నుంచే అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎస్బీఐ కూడా పదివేలు దాటిన క్యాష్ విత్డ్రాయల్స్కు మాత్రమే ఈ ఓటీపీ విధానం అమలు చేస్తోంది. త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నాయి.
క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు సంబంధిత వ్యక్తి వద్ద డెబిట్ కార్డుతో పాటు రిజిస్టర్డ్ నెంబర్ మొబైల్ కూడా వెంట ఉండాలి. డెబిట్ కార్డు ఏటీఎంలో పెట్టి.. పిన్ ఎంటర్ చేసి..కావల్సిన నగదు కోరిన తరువాత ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది కాబట్టి నెట్ అవసరం లేదు. మొబైల్ నెంబర్కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీ.. ఏటీఎంలో ఎంటర్ చేసిన తరువాతే..మీరు కోరిన నగదు విత్డ్రా అవుతుంది.
ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రాయల్ ప్రాసెస్:
కాబట్టి కస్టమర్లు.. క్యాష్ విత్డ్రాయల్ కోసం ఏటీఎంకు వెళ్లేముందు బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరు వెంటపెట్టకెళ్లడం మంచిది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Introducing the OTP-based cash withdrawal system to help protect you from unauthorized transactions at ATMs. This new safeguard system will be applicable from 1st Jan, 2020 across all SBI ATMs. To know more: https://t.co/nIyw5dsYZq#SBI #ATM #Transactions #SafeWithdrawals #Cash pic.twitter.com/YHoDrl0DTe
— State Bank of India (@TheOfficialSBI) December 26, 2019