సంపద పెరగాలంటే డబ్బుని ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే అది పిల్లల్ని పెడుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే రిస్క్ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది స్టాక్ మార్కెట్ జోలికి పోరు. అలా అని మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం పాటు ఎదురుచూస్తే తప్ప లాభాలు రావు. మరి రిస్క్ లేకుండా పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో మంచి లాభాలు వచ్చే మార్గం ఏదైనా ఉందా? అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఆ మార్గం పేరే కిసాన్ వికాస్ పత్ర. పోస్టల్ శాఖ అందించే 9 పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఈ కిసాన్ వికాస్ పత్ర ఒకటి. తక్కువ రిస్క్ తో కూడుకున్నది. పైగా ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టడానికి జనం ఎప్పుడూ ముందుంటారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ లాభాలను కోరుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర ఉత్తమ మార్గం.
ఏడాదికొకసారి 124 నెలల పాటు పెట్టుబడి పెడుతూ వెళ్తే.. 124 నెలల తర్వాత అంటే పది సంవత్సరాల 4 నెలల తర్వాత రెట్టింపు లాభాలను పొందవచ్చు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. కనీసం 124 నెలల పాటు పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఏడాదికి రూ. 50 వేలు చొప్పున పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే పదేళ్ల తర్వాత 10 లక్షలు పొందవచ్చు. పెట్టుబడి పెట్టింది 5 లక్షలే అయితే.. దానికి రెట్టింపు డబ్బు వస్తుంది. ఈ స్కీం మైనర్ పిల్లలకి, 40 ఏళ్లు పైబడిన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఏడాదికి రూ. 50 వేలు అంటే నెలకి రూ. 5 వేల కంటే తక్కువే. అయితే రూ. 50 వేలకు పైగా పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ కాపీ జత చేయాల్సి ఉంటుంది. ఈ స్కీంలో చేరిన వారికి ‘కిసాన్ వికాస్ పత్ర’ సర్టిఫికెట్ అందజేస్తారు
రిస్క్ తక్కువ. కేవీపీ సర్టిఫికెట్ లో మెన్షన్ చేసిన వడ్డీ రేటుకి మీ మెచ్యూరిటీ టైంకి ఎంత డబ్బు అయితే ఇస్తామని పేర్కొన్నారో అంతే డబ్బు ఇస్తారు. వడ్డీ రేట్లు మారినా మీ పెట్టుబడి మీద ప్రభావం చూపించడం లేదు. ఒకవేళ పెట్టుబడి పెట్టిన డబ్బుల్ని మధ్యలో వెనక్కి తీసుకోవాలనుకుంటే వడ్డీ తక్కువైనా గానీ తక్కువ పెనాల్టీతో పెట్టిన డబ్బుని పొందవచ్చు. రెండు సంవత్సరాల తర్వాత అయితే పెనాల్టీ ఉండదు, వడ్డీ రేటులో మార్పు ఉండదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థ. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేశాక వెట్ క్లాత్ ఏసుకుని పడుకోవచ్చు. మరి ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Kisan Vikas Patra: Invest 5 lakh on this govt scheme, cash will probably be doubled in 124 months, know the area of expertise of this scheme https://t.co/Rz1DstA7GD
— news24buzz (@news24buzz1) September 26, 2022