మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన మృతిపై వ్యాపార వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నాయి.
ఇండియాలో అత్యంత వృద్ధ బిలియనీర్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ ఛైర్మన్ కేషుబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. ఇన్స్పేస్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. పారిశ్రామిక ప్రపంచం బుధవారం అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని పవన్ గోయెంకా సంతాపం ప్రకటించారు. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, సామాజిక విషయాల్లో అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచే వ్యక్తి కేషుబ్ మహీంద్రా అంటూ ట్వీట్ చేశారు. 1947లో మహీంద్రా గ్రూపులో చేరిన కేషుబ్.. 48 సంవత్సరాల పాటు అంటే దాదాపు అర శతాబ్దం ఆ సంస్థకు ఛైర్మన్గా నాయకత్వం వహించారు.
ప్రస్తుతం ఎంఅండ్ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు కేషుబ్ మేనమామ అవుతారు. తన తండ్రి నెలకొల్పిన మహీంద్రా గ్రూపులో 1963 నుంచి 2012 వరకు ఛైర్మన్గా విశేష సేవలందించారు కేషుబ్. అలాంటి కేషుబ్ రిటైర్మెంట్ తర్వాత ఆయన వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. ఆనంద్ మహీంద్రా సక్సెస్ఫుల్గా కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన హయాంలో కంపెనీ దేశంలోని టాప్ ఆటోమొబైల్స్ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. రోడ్లపై ఎక్కడ చూసినా మహీంద్రా వాహనాలే కనిపిస్తున్నాయి అంటే దాని వెనుక ఆనంద్ మహీంద్రా కృషి ఎంతగానో ఉంది.
The industrial world has lost one of the tallest personalities today. Shri Keshub Mahindra had no match; the nicest person I had the privilege of knowing. I always looked forward to mtgs with him and inspired by how he connected business, economics and social matters. Om Shanti.
— Pawan K Goenka (@GoenkaPk) April 12, 2023