కేంద్ర ప్రభుత్వం నిత్యం అనేక రూల్స్ తీసుకొస్తుంటుంది. దేశ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడ రాజీపడటం లేదనే కొందరి కేంద్ర మంత్రుల వాదన. అందుకే పన్ను ఎగవేతదారులపై కొరడ జులిపిస్తుంది. ఎవరిని ఎక్కడ వదిలేదన్నట్లు దొరికన చోటు దొరికినట్లు వీరబాదుడు బాదుతుంది కేంద్రం. భారీ ఆదాయం ఉన్న కోట్ల కంపెనీలను వదిలిపెట్టేది లేదన్నట్లు ఉంది కేంద్ర ప్రభుత్వం వైఖరి. ఈ నేపథ్యంలో కేవలం చైనా మొబైల్ కంపెనీలకే కాదు దేశీయ మొబైల్ కంపెనీలకు సైతం కేంద్ర ప్రభుత్వం షాక్ ఇస్తుంది. డిస్ ప్లే ఫ్యానల్ దిగుమతులపై పన్ను ఎగవేశారని, ఈ కంపెనీలకు కస్టమ్స్ అధికారులు నోటిలుసు జారీ చేసినట్లు సమాచారం.
నోటీసులు అందుకున్న కంపెనీల్లో మైక్రోమాక్స్, లావా, కర్బన్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పన్ను ఎగవేత ఎంతలేదన్న సుమారు రూ.20,000 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాస్తవానికి 2020 సెప్టెంబర్ వరకు దిగుమతులపై సుంకం లేదు. అయితే 2020 అక్టోబర్ 1 నుంచి మాత్రం వీటిపై 10 శాతం దిగుమతి సుంకం విధించారు. అయితే కొన్ని మొబైల్ కంపెనీలు.. వేరే పేర్లతో ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకుంటున్నట్లు అధికార వర్గాల అనుమానం. ఈ విషయం బయటకి రావడంతో 2017 నుంచి వర్తించే పన్ను వసూలకు సిద్దమైంది కస్టమ్స్ శాఖ.
దీంతో రూ.20,000 కోట్ల నోటీలుసు జారీ చేసినట్లు సమాచారం. సామ్ సంగ్ మినహా అన్ని కంపెనీల పై ఈ ట్యాక్స్ భారం పడుతుందని భావిస్తున్నారు. సామ్సంగ్ కంపెనీ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న తైవాన్ నుంచి డిస్ప్లే అసెంబ్లీ ప్యానెల్స్తో పాటు అన్ని విడి భాగాలు దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఈ కంపెనీపై మాత్రం ఎలాంటి భారం ఉండదని సమాచారం. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒకప్పుడు టాటాను అవమానించిన ఫోర్డ్ కంపెనీ.. ప్లాంట్ మూసేస్తున్న తరుణంలో చివరి కారు విడుదల!
ఇదీ చదవండి: Infinix: అదిరిపోయే ఫీచర్లతో రూ.8 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ!
ఇదీ చదవండి: ఉద్యోగులకు శుభవార్త! PF విత్ డ్రాపై ఆ నిబంధన ఎత్తివేత..