ప్రముఖ కంపెనీల సీఈవోలకు లక్షల్లో, కోట్లల్లో జీతం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఓ ప్రముఖ కంపెనీలో సీఈవో కి ఏకంగా రూ.123 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు హెచ్సీఎల్ టెక్ సీఈవో సి.విజయ్ కుమార్. ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా విజయ్ కుమార్ నిలవడం విశేషం. ఇటీవల హెచ్సీఎల్ టెక్ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ సీఈవో సి.విజయ్కుమార్కు రూ.123.13 కోట్ల వేతనం అందించినట్లు పేర్కొంది.
విజయ్ కుమార్ ఆదాయంలో నాలుగింట మూడొంతులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో పొందుపరచబడిందని హెచ్సీఎల్ కంపెనీ ఈ మేరకు స్పష్టం చేసింది. ‘మా కంపెనీ నుంచి విజయకుమార్ ఎలాంటి వేతనం పొందలేదు. మా అనుబంధ సంస్థ అయిన ‘హెచ్ సీఎల్ అమెరికా ఇంక్’ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్ల (రూ. 123. 13 కోట్లు) పారితోషికం అందుకున్నారు’ అని వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇక విజయకుమార్ వార్షిక మూల వేతనం 2 మిలియన్ డాలర్లు కాగా, వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని తెలిపింది. అంతేకాదు హెచ్సీఎల్ కంపెనీ దీర్ఘకాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్లు చెల్లించడం జరిగింది. దీంతో మొత్తంతో ఆయన జీతం16.52 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది ఆయన టార్గెట్స్ చేరుకునే తీరు ఆధారంగా నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తాం అని వివరించింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.