రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం సరుకుల మీద పడింది. యుద్ధం సాకుగా చూపి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు స్థానిక వ్యాపారులు. వంట నూనెల ధరలు అమాంతం పెంచేశారు. ఆన్లైన్లో కూడా రేట్లు అమాంతం పెంచేశారు. అన్ని సరుకులపై ఆఫర్లు పెట్టినప్పటికి.. వంటనూనెపై మాత్రం ఎలాంటి ఆఫర్లు పెట్టడం లేదు. దీంతో కంపెనీలు సైతం రేట్లు అమాంతం పెంచేశాయి. సామాన్యుడు సైతం వాటిని అందుకోలేకపోతున్నాడు. దీన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని దుకాణాల్లో అసలు రేట్లను దాచేసి.. దానిపైన మరో నకిలీ రేట్లను అతికిస్తోంది.
యుద్ధం సాకుగా పెట్టుకుని ప్రజల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. ఎదురించి ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండి.. డీలర్ల నుంచి కూడా ఇదే రేట్ వస్తుంది అని చెబుతున్నారు. దీంతో ఏం చేయలేక.. పట్నం వెళ్లి కొన్నా.. అదే రేటు వస్తుందని.. ధర ఎంత చెబితే అంతకు కొనేస్తున్నారు.
ఆయిల్ ప్యాకెట్పై ఉన్న అసలు ధరపై పెంచిన ధరల తెల్లటి స్టిక్కర్ ను అతికిస్తున్నారు. ఎలాగో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి.. ప్రస్తుతం ఉన్న MRPని చూసి పాత ఆయిల్ ప్యాకెట్లకు కొత్త రేట్లు డిసైడ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
నూనె కొరత ఉండటంతో చెప్పిన రేట్కు కొంటే కొను లేదంటే లేదు అని చెప్పేస్తున్నారు.ఈ విధంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేస్తున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేం పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంటనూనెల ధరలపై మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.