స్థిరాస్తి ఏదైనా కావచ్చు.. దానికి మనం యజమానులం అని నిరూపించేది ఆస్తి పత్రాలే. ఇల్లు, ఫ్లాట్, పొలాలు.. ఇలా వివిధ రకాలైన స్థిరాస్తులకు ఎవరైన తమవే అనేందుకు యాజమాన్య దస్తావేజులే కీలకం. ఆస్తుల విషయంలో ఏదైన గొడవలు జరిగినప్పుడు ఈ దస్తావేజులే కీలక పాత్రపోషిస్తాయి. మరి.. ఇంతటి విలువైన పత్రాలను ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో ఆస్తి పత్రాలు కనిపించకుండా పోతాయి. మరి.. అలాంటి సందర్భాల్లో ఏం చేయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. మరి.. ఆస్తి పత్రాలు పోగొట్టుకునప్పుడు ఏం చేయాల్లో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక ఆస్తికి సంబంధించిన చట్టపరమైన హక్కును తెలియజేసేదే యాజమాన్య పత్రాలు. వీటినే టైటిల్ డీడ్ అని కూడా పిలుస్తుంటారు. మీ స్థిరాస్తికి సంబంధించిన అసలు పత్రాలు లేకపోతే… ఆ ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. అలా ఎప్పుడైన అనుకోని పరిస్థితుల్లో మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోతే డూప్లికేట్ పొందేందుకు వీలుటుంది. అయితే వీటిని పొందేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా, దొంగతనం జరిగిన వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. అనంతరం ఎఫ్ఐఆర్ లేదా ఎన్సీఆర్ ను ఫైల్ చేయించాలి. ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఓ కాపీని మీ వద్ద ఉంచుకోవాలి. మీరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వాటిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
అవి లభించని పక్షంలో నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ ను జారీ చేస్తారు. ఈ పత్రం.. మీకు నిజంగానే నష్టం జరిగిందని తెలియజేస్తుంది. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందేందుకు ఈ ఎన్టీసీ నే కీలకం. అలానే ఆస్తి పత్రాల మిస్సింగ్ నోటిసును కనీసం రెండు న్యూస్ పేపర్స్ లో ప్రకటన వేయించాలి. అందులో ఒకటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, మరొకటి స్థానిక భాష వార్త పత్రిక అయితే మంచిది. ఇలా చేయడం ద్వారా ఒకవేళ ఎవరికైన దొరికితే తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే డూప్లికేట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. రూ.10 నాన్ జుడీషియల్ స్టాంప్ పత్రంపై నోటరి చేయించాలి. ఇందులో ఎఫ్ఐఆర్ నంబరు, మిస్సైన ఆస్తి పత్రాలనకు సంబంధించిన వివరాలను పేర్కొనాలి.
15 రోజుల నోటిసు వ్యవధి ముగిసిన తరువాత, ఆస్తి పత్రాలు, కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్-రిజిస్ట్రా కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో డూప్లికేట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం 7 నుంచి 10 రోజుల పని దినాల్లో డూప్లికేట్ సేల్ డీడ్ లేదా యాజమాన్య దస్తావేజుల కాపీని పొందుతారు. అలా వచ్చిన పత్రాలపై సబ్ రిజిస్ట్రార్ ఆమోదంతో కూడిన స్టాంప్ ఉంటుంది. కాబట్టి ఆ పత్రాలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఇలా పొందిన ఆస్తి పత్రాల ద్వారా స్థిరాస్తి అమ్మకకొనుగోలు చేయవచ్చు. అలానే రుణ కోసం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు పోగొట్టుకున్న సందర్భంలోఇలా తిరిగి పొందవచ్చు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.