ఏ దేశాలతో పోల్చుకున్నా కూడా భారతదేశంలో మాత్రం బంగారాన్ని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా భారత్లో బంగారం-వెండి మీద పెట్టుబడులు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధర కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది ఇలాంటి సమయంలోనే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంతేకాకుండా అక్టోబర్ 23న ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని చాలా మంది భావిస్తుంటారు. ఆరోజు బంగారం కొంటే బాగా కలిసివస్తుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ధంతేరస్ కు ఫోన్ పే తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అసలు ఆ ఫోన్ పే ఆఫర్ ఏంటి? ఎవరు అర్హులు? ఎంత వరకు బంగారం కొనచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.
ఫోన్ పో బంగారం- వెండి కొనుగోళ్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. అక్టోబర్ 26 వరకు ఫోన్ పే ద్వారా బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తే.. యూజర్లకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ధంతేరస్ సందర్భంగా ఈ ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఆఫర్ పొందాలంటే.. మీరు ఫోన్ పే ద్వారా రూ.1000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాలి. యూజర్లు ఫోన్ పే ద్వారా స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం లేదా వెండిన కొనుగోలు చేయచ్చు. దానిని మీరు ఇంటికే తెప్పించుకోవచ్చు. లేదంటే మీకు మరో అవకాశం కూడా ఉంది. అదేంటంటే.. మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని డిజిటల్ గా గ్రేడ్ గోల్డ్ లాకర్ లో దాచుకునే అవకాశం కూడా ఉంది.
బంగారం కొనుగోళ్లపై రూ.2,500, వెండి కొనుగోలుపై రూ.500 వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అయితే ఫోన్ రేలో ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం. ఫోన్ పేలో వివిధ రకాల కాలమ్స్ ఉంటాయి. వాటిలో చివరిన వెల్త్ అనే కాలమ్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి. అక్కడ బంగారం లేదా వెండి మీరు ఏది కొనుగోలు చేయాలని భావిస్తున్నారో దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు బంగారు కాయిన్స్, వెండి కనిపిస్తాయి. అక్కడే మీకు వాటి బరువు, ధర చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు బంగారంలో ఇన్ వెస్టిమెంట్ కూడా పెట్టవచ్చు. స్టార్ట్ ఇన్ వెస్టింగ్ ఇన్ గోల్డ్ అని కూడా మీకు అక్కడ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎంత కొనుగోలు చేయాలని అనుకుంటారో అంత నిర్ణయించుకున్నాక.. ప్రొసీడ్ టు బై కొట్టాలి. అక్కడ పేమెంట్ చేయాలి. అయితే మీరు ఫోన్ పే షరతులు, నిబంధనలను పూర్తిగా చదువుకున్న తర్వాతే కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.