ఇండియా సిమెంట్స్ చెన్నైలో సిమెంట్ తయారీ సంస్థలలో ఒకటి. ఇండియాలోనే అతిపెద్ద 9వ సిమెంట్ కంపెనీ. అయితే ఇప్పుడు ఈ సంస్థ ప్రైవేటు రంగానికి చెందినది. ప్రస్తుతం సంస్థ పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఇండియా సిమెంట్స్ చెన్నైలో సిమెంట్ తయారీ సంస్థలలో ఒకటి. ఇండియాలోనే అతిపెద్ద 9వ సిమెంట్ కంపెనీ. ఈ సంస్థ తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రపదేశ్ మూడు రాష్ట్రాల్లో 7 ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్స్ కలిగిఉన్నాయి. దీనికి ఎండీ ఎన్. శ్రీనివాసన్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ ప్రైవేటు రంగానికి చెందినది. ప్రస్తుతం సంస్థ పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
2021-22 సంవత్సరాంలో కేవలం రూ. 24 కోట్ల నష్టం కనబరిచింది. తర్వాత 2022-23 సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉత్సాహ పూరిత ఫలితాలు కనబరచలేదు. జనవరి-మార్చి (క్యూ4)లో రూ.218 కోట్ల స్టాండెలోన్ నికర నష్టం పెరిగింది. దీనికి కారణం ఇంధనం, విద్యుత్ వ్యయాలు భారీగా పెరగడమే.మొత్తం ఆదాయం రూ.1,397 -1,479 కోట్లకు పెరిగింది. పెట్టుబడి నష్టాలు, రైటాఫ్ లను క్యూ4 ఫలితాలను పోల్చి చూడొద్దని కంపెనీ తెలిపింది. మార్చిలో ముగిసిన సంవత్సరానికి రూ.189 కోట్ల నికర నష్టం పేర్కొంది. 2021-22లో రూ.39 కోట్ల నికర లాభం పొందింది. అయితే మొత్తం ఆదాయం రూ.4,730కోట్ల నుండి 5,415 కోట్లకు ఎగబాకింది. కాగా.. పోయిన సంవత్సరం క్యూ1లో రూ. 76కోట్ల లాభం, క్యూ2లో రూ.138 కోట్ల నష్టం,క్యూ3లో రూ.91 కోట్ల లాభం ప్రకటించారు. పూర్తి సంవత్సరానికి రూ. 218 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.
క్యూ3లో ఆస్తుల విక్రయం ద్వారా రూ.294 కోట్లు ఆర్జించడంతో లాభాలు ప్రకటించారు.తమిళనాడులోని ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండీ ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నారు.ఆసక్తి ఉన్న పార్టీలతో చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. కంపెనీకి గల మొత్తం 26,000 ఎకరాలలో 1,000 ఎకరాల భూమిని మానిటైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రూ.500 కోట్ల మేర రుణ భారాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. కంపెనీకి మొత్తం రూ.2,900 కోట్ల రుణాలున్నట్లు వివరించారు.