ఈఎంఐ.. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఈ పదం బాగా సుపరిచితమే. బేసిక్ గా ప్రతి మధ్యతరగతి వ్యక్తి కచ్చితంగా నెలవారీ వాయిదాల్లో ఏదో ఒకటి కొనుంటాడు. లేదా రుణం తీసుకుని దానిని ఈఎంఐలోకి మార్చుకుని ఉంటాడు. ఆటోమొబైల్, ఇంటి రుణం, పర్సనల్ లోన్ ఇలా ఏదో విధంగా వాయిదాలు కడుతూనే ఉంటాడు. భారం తగ్గుతుందనే ఉద్ధేశంతో తీసుకున్న నెలవారీ వాయిదాలు ఇప్పుడు నడ్డివిరిచేసేలా ఉన్నాయి. భారం కాకూడదని తీసుకున్న ఈఎంఐలే ఇప్పుడు మరింత భారం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటుని పెంచడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటుని 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతంగా నిర్ణయించింది. దాంతో అన్ని బ్యాంకులు రుణరేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఉదాహరణకు మీరు ఏప్రిల్ లో 6.5 శాతం వడ్డీతో తీసుకున్న లోన్ ఇప్పుడు 8.5 శాతం లేనిదే దొరకే పరిస్థితి లేదు. అంటే మీరు కట్టే వడ్డీ 2.5 శాతం మేర పెరగనుంది.
వాస్తవానికి బ్యాంకులు అన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అప్పు తీసుకుని తిరిగి పౌరులకు కొంతమేర లాభంతో తిరిగి అప్పులు ఇస్తాయి. రెపో రేటు పెరగడంతో ఇప్పుడు బ్యాంకులపై వడ్డీ భారం పెరిగనుంది. అందుకే అవి పౌరులకు ఇచ్చే రుణాలకు కూడా వడ్డీ రేటుని పెంచబోతున్నాయి. దానికి అనుగుణంగానే తమ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్కుగా బ్యాంకులు రెపో రేటుని ఆధారం చేసుకుంటున్నాయి. బ్యాంకులు తీసుకోనున్న ఈ నిర్ణయంతో కొత్తగా తీసుకోవాలనుకునే రుణాలపై వడ్డీ రేటు పెరగనుంది. అంతేకాకుండా ఇప్పటకే తీసుకున్న ఈఎంఐలు కూడా మరింత భారం కానున్నాయి. ఒకవేళ మీరు ఈఎంఐని పెంచకూడదని భావిస్తే.. లోన్ టెన్యూరు పెరుగుతుంది. ఎలాగైనా బ్యాంకులు తమపై పడనున్న భారాన్ని చివరకి వినియోగదారుల మీదే మోపుతుంది.
RBI Governor Shaktikanta Das announces that RBI “increases the policy repo rate by 50 basis points to 5.9% with immediate effect.” pic.twitter.com/YpDjOVsgus
— ANI (@ANI) September 30, 2022
RBI hikes #RepoRate by another 50 basis points, taking it to 5.9%. This is the fourth consecutive hike in repo rate since May.#EMI on home loans, car loans & other loans are set to get even more expensive. pic.twitter.com/a5KtVQGm9u
— The Tatva (@thetatvaindia) September 30, 2022