దేశంలో బ్యాంకుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ), నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటివరకు అలాంటి బ్యాంకులను జరిమానాతో సరిపెట్టిన ఇకపై తీవ్ర చర్యలు ఉంటాయన్నట్లుగా హెచ్చరించింది. అందులో భాగంగా ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు, ఒక కో-ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ క్యాన్సల్ చేసింది. దీంతో ఆ బ్యాంకు మరి కొన్ని గంటల్లో శాశ్వతంగా మూతపడనుంది. ఆ వివరాలు..
ఆర్బీఐ నిబంధనలు, బ్యాంకు మార్గదర్శకాలను పాటించనందుకు పూణేలోని రూపే కో ఆపరేటివ్ బ్యాంకును మూసివేయాలని ఆర్బీఐ గత నెల 10న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 10 నుంచి ఆరు వారాల్లో ఈ బ్యాంకును మూసి వేయనున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. అంటే.. సెప్టెంబర్ 22, 2022తో ఆ గడువు ముగియనుంది. ఈ విషయంపై కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించారు. గడవులోగా కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి మనీ విత్ డ్రా చేసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసింది. గడువు ముగిశాక మరో అవకాశం ఉండదని పేర్కొంది.
బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్ను రద్దు చేసింది. అయితే.. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అంటే.. రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
భారతదేశంలోని అతి ముఖ్యమైన ఆర్థిక సంస్థలలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)’ ఒకటి. దీనినే ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. ఇది అన్ని వాణిజ్య బ్యాంకుల మాతృ సంస్థ లాంటిది. డబ్బును పంపిణీ చేయడం, నియంత్రించడం లాంటివి దీని విధులు. అంతేకాదు.. దేశంలో డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్బిఐ నియంత్రిస్తుంది. దేశంలోని ఏ బ్యాంకు అయినా.. ఆర్బీఐ నిబంధనలకు లోబడే పనిచేయాలి. అలా కాదంటే.. జరిమానా విధంచడం, అంతకు మితిమీరితే.. లైసెన్స్ క్యాన్సల్ చేయడం చేస్తుంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.