‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులను స్మార్ట్ ఫోన్లకు కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యారు. వారియర్స్ Vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కావడంతో ప్రతి విషయంలో వాళ్లు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇంక టాస్కుల విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. హౌస్ లో ఫుల్ రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా నడుస్తున్న తగ్గేదేలే టాస్కులో అయితే ఏకంగా ఇంట్లోని సభ్యులు ఫిజికల్ కూడా అయ్యారు. ఆ గొడవలో శ్రీరాపాక, అనీల్ రాథోడ్ కు గాయాలయ్యాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
సీనియర్స్ అందరూ స్మగ్లర్స్ గా, జూనియర్స్ అందరూ పోలీసులుగా కాన్సెప్ట్ మొదలైంది. పోలీసులు మొదట్లో డోర్లు మూయడంతో కాసేపు ఆట సాగలేదు. ఆ తర్వాత అందరం కలిసి వెళ్తాం అని గొడవ చేశారు. ఈ గ్యాప్ లో మహేశ్ విట్టా హౌస్ లో తొలిసారి రెచ్చిపోయాడు. సహనం కోల్పోయి మొగోడివైతే తలుపు తీసి ఆడండి అంటూ కేకలు వేశాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా డైలాగులు వేశాడు. చివరికి బిగ్ బాస్ కలగజేసుకుని వార్నింగ్ ఇవ్వడంతో ఆట ముందుకు సాగింది. ఆటలో వారియర్స్, చాలెంజర్స్ బాగానే గొడవలు పడ్డారు.
బొమ్మల్ను స్మగల్ చేసే క్రమంలో వారియర్స్ ఇంటి లోపల నుంచి బయటకు బొమ్మలు విసిరారు. మొదట్లో రెండు బొమ్మలను అనీల్ పట్టుకుని సీజ్ చేయడంతో ఈసారి సీనియర్స్ అతి తెలివి వాడారు. మొదట యాపిల్ విసరడం, ఆ తర్వాత బొమ్మ విసరడం చేశారు. అలా చేసే క్రమంలో అషు రెడ్డి విసిరిన యాపిల్ శ్రీరాపాక తలకు తగిలడంతో ఆమె కుప్పకూలింది. ఆ తర్వాత అనీల్ రాథోడ్ కి కూడా యాపిల్ తన వెనుక భాగంలో, బొమ్మ దవడకు బలంగా తాకాయి. ఆ దెబ్బకు ఛాలెంజర్స్ గేమ్ ఆపేశారు. కానీ, వారియర్స్ మాత్రం బొమ్మలు తగులుతాయని తెలియదా? తప్పుకోవాలి గానీ ఎదురుగా ఉంటే ఎలా? కావాలని కొట్టం కదా అంటూ వితండవాదన చేసి బొమ్మలు డ్రాప్ బాక్స్ వేశారు. అలా ఆ టాస్క్ విన్ అయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.