బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ అట్టహాసంగా ముగిసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో టైటిల్ కొట్టిన తొలి లేడీ కంటెండర్ గా బిందు మాధవి రికార్డు సృష్టించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మాదిరిగానే అఖిల్ సార్థక్ ఈ సీజన్ లోనూ రన్నర్ గానే మిగిలిపోయాడు. ఈసారి కప్పు కొడతాడనుకున్న అఖిల్ రన్నర్ కావడంతో అతని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే బిందు మాధవి మాత్రం మొదటి నుంచి అనుకున్న విధంగానే కప్పు కొట్టేసింది. ఆడపులి అని నిరూపించుకుంది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బిందు మాధవి విన్నర్ అవ్వడాన్ని ఆమె కూడా నమ్మలేకపోయింది. ఓట్లు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బిందు మాధవి ఎమోషనల్ అయ్యింది. బిందు మాధవి టైటిల్ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.