‘బిగ్ బాస్ ఓటీటీ’ ఉత్సవం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని గంటల సమయంలో మాత్రమే మిగిలుంది. అప్పుడే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉత్సాహం మొదలైపోయింది. తాజాగా నిర్వాహకులు మరో ప్రోమోని విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ స్ట్రీమింగ్ కాబోతోంది బిగ్ బాస్. ఈ షోకి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు.
ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఎవరు అనేది క్లియర్ గా చూపించక పోయినా కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇప్పటి వరకు వినిపించిన పేర్లు నిజమే అని తెలుస్తోంది. సెవెన్ ఆర్ట్స్ సరయు ఛాన్స్ కొట్టేసింది. రోల్ రైడా కూడా హౌస్ లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే సాయంత్రం 6 గంటలకు అంతా రివీల్ అవుతుంది అని కింగ్ నాగార్జున చెబుతున్నాడు. మీ అంచనా ప్రకారం ఎవరు హౌస్ లో ఉండబోతున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.