తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఓటిటి సీజన్ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ తమ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ కింగ్ నాగార్జున చాలా హుషారుగా షో ఫస్ట్ ఎపిసోడ్ ని ముందుకు తీసుకెళ్లారు. అయితే.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లందరితో మాట్లాడుతూ వారు హౌస్ లో ఎలా ఉండబోతున్నారు? అనే ప్రశ్న అడిగారు.
ఇకపై 24 గంటలు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఓటిటి షో.. 17 మంది కంటెస్టెంట్లతో 84 రోజులపాటు సాగనుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ ని కూడా కొత్తగా డిజైన్ చేశారు. అయితే.. గత సీజన్లలో పాల్గొన్న వారిని వారియర్స్ గాను, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారిని ఛాలెంజర్స్ గా పేర్కొన్నారు. ఇక వీరి మధ్యే బిగ్ బాస్ లో పోటీ ఉంటుందని నాగ్ క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో వారియర్ కేటగిరీలో మొదటి కంటెస్టెంట్ గా అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చింది. ‘ఊ అంటావా మామ’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉండనుందో చెప్పుకొచ్చింది. ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తున్నావ్.. ఇంట్లో ఏం చేస్తావ్? అని నాగార్జున సెటైరికల్ గా అడిగాడు. అషు మాట్లాడుతూ.. హౌజ్ లో అన్నీ చేస్తాను. కానీ.. లవ్ జోలికి అస్సలు వెళ్లను. ఇప్పటికే చాలా చూశాను. ఇక చాలు’ అని చెప్పింది.
ఆ వెంటనే.. ఇంట్లోకి వచ్చేముందు రాహుల్ ఏం సలహా ఇచ్చాడు? అని నాగ్ అడిగారు. తనలా మాత్రం ఆడొద్దని, ఏం చేసినా ఎంజాయ్ చేస్తూ చేయమని అన్నాడు.. ఇంట్లో పిచ్చెక్కిస్తా, కొత్త అషూ రెడ్డిని చూస్తారు అంటూ.. ఇంట్లోకి ఫస్ట్ కంటెస్టెంటుగా వచ్చాను. చివరన వెళ్ళేటట్లు చేయమని కోరింది అషూ. మరి అసలే బోల్డ్ బ్యూటీగా ఫేమ్ ఉన్న అషు.. ఈసారి హౌజ్ లో ఏమేం చేస్తుందో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అషు ఎంట్రీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.